Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాల్పుల్లో గాయపడిన వారిని పరామర్శించిన అమెరికా అధ్యక్షుడు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు టెక్సాస్ నగరంలో నిరసన సెగ తాకింది. గతవారం మెక్సికో సరిహద్దులోని టెక్సాస్ నగరంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 9 మంది మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దుండుగున్ని మట్టుబెట్టారు. మరో కాల్పుల ఘటన వాల్మార్ట్ స్టోర్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో దుండగుడు 22 మందిపై కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ రెండు ఘటనల్లో 52 మంది గాయపడ్డారు. ఒహియోలోని మియామీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సతీసమేతంగా ట్రంప్ పరామర్శించారు. వైద్యులు అందిస్తున్న చికిత్సపై ఆరా తీశారు. ఈనేపథ్యంలో దాదాపు 200 మంది నిరసనకారులు ట్రంప్ రాకను నిరసిస్తూ మియామీ ఆస్పత్రి ముందు ప్రదర్శనలు చేపట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శరణార్థుల పట్ల ట్రంప్ అనుసరిస్తున్న విధానాల కారణంగా అమెరికాలో హింసాత్మక, కాల్పుల ఘటనలు చోటుచేసుకుం టున్నాయని విమర్శించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలసదారులపై, మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. ట్రంప్ పాలనలో క్రైమ్ రేట్ పెరిగిపోయిందని అన్నారు. 'ట్రంప్ ఓ జాత్యహం కారి... ఆయన్ను గద్దె దింపే సమయం ఆసన్నమైంది' అని ముద్రించిన బ్యానర్లను నిరసనకారులు ప్రదర్శించారు. అమెరికాలో తుపాకుల సంస్కృతిని నిర్మూలించేందుకు ట్రంప్ ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని నిరసనకారులు విమర్శించారు. తుపాకుల ఉపయోగాన్ని నియంత్రించేం దుకు పటిష్టమైన చట్టాలను రూపొందించాలని కోరారు. టెక్సాస్లో కాల్పులకు పాల్పడ్డ నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ట్రంప్ సర్కారు పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు.