Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 400కి చేరిన మృతుల సంఖ్య
ఆమ్స్టర్డామ్ : నెదర్లాండ్లో వడగాడ్పులు వీస్తున్నాయి. దీంతో, ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండల తీవ్రతను తాళలేక మృతి చెందిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 400కి చేరుకుందని అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. గతనెల25న పలు నగరాల్లో 40డిగ్రీల సెల్సియస్ పైగా ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.