Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈయూ ఆంక్షలను ఉల్లంఘించలేదు: ఇరాన్
టెహ్రాన్ : యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆంక్షలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై బ్రిటన్ నావికాదళం స్వాధీనం చేసుకున్న గ్రేస్-1 నౌక విడుదలకు రంగం సిద్ధమైందని ఇరాన్ వెల్లడించింది. ఈయూ ఆంక్షలను గ్రేస్-1 ఉల్లంఘించలేదని పునరుద్ఘాటించింది. ఈమేరకు అవసరమైన ఆధారాలను బ్రిటన్కు సమర్పించినట్టు ఇరాన్ పేర్కొంది. సిరియాకు చమురు రవాణా చేయాలనే ఆలోచన తమకు లేదని ఇరాన్ నౌకాదళ అధికారి జలాల్ ఇస్లామీ తెలిపారు. అమెరికా ఒత్తిడితోనే ఇరాన్పై అక్రమ కేసులు బనాయించాలని బ్రిటన్ ప్రయత్నించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతనెల4న గిబ్రాల్టర్లో గ్రేస్-1 నౌక ఈయూ ఆంక్షలను ఉల్లంఘించిందనే ఆరోపణలను ఎదుర్కొంది. ఈ కేసులో బ్రిటన్ నావికాదళం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే, నేరనిరూపణ పత్రం దాఖలుకు తుది గడువు ఈనెల10తోనే ముగిసింది. ఇదిలా ఉండగా, ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం నుంచి తప్పుకున్న తర్వాత ఇరాన్పై భారీ ఆంక్షలు మోపింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని అగ్రరాజ్యం కుట్ర పన్నింది. ఇరాన్తో ద్వైపాక్షిక సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని మిత్రదేశాలపై ఒత్తిడి పెంచింది. పలు దేశాలు ఇరాన్తో ఉన్న వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకున్నాయి.