Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐరాసకు పాక్ లేఖ
ఇస్లామాబాద్: జమ్మూ కాశ్మీర్ అంశంపై తక్షణ సమా వేశం నిర్వహించాలని ఐక్య రాజ్య సమితికి పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ లేఖ రాశారు. 'భారత్ తీసుకుం టున్న చర్యల వల్ల అంతర్జా తీయ సమాజంలో శాంతికి విఘాతం కలుగుతోంది. ఈ విషయంపై అత్యవసర విచారణ జరపాలని కోరుకుం టున్నాం. మా నిగ్రహాన్ని చేతగానితనంగా భారత్ భావిస్తోంది' అని లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై 15సభ్యుల కమిటీ ఎలా స్పందిస్తుందో తెలియరాలేదు. దీనిపై పోలాండ్ విదేశీ మంత్రి జాసెక్ జాపుటోవిజ్ స్పందిం చారు. పాక్ నుంచి ఐరాసకు లేఖ అందిందని, దీనిపై చర్చిస్తామన్నారు.