Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాణిజ్య పోరు పెంచితే ప్రతీకారం
బీజింగ్: ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య, టెక్నాలజీ పోరును ఉధృతం చేయాలని అమెరికా ప్రయత్నిస్తే తాము ప్రతీకార చర్యలు చేపట్టాల్సి ఉంటుందని అమెరికాను చైనా ఘాటుగా హెచ్చరించింది. సెప్టెంబర్ ఒకటి నుంచి చైనా దిగుమతులపై అదనపు సుంకాలను విధించాలన్న ప్రతిపాదనను అమలు చేస్తే తాము కూడా అమెరికన్ దిగుమతులపై సుంకాలు విధిస్తామని స్పష్టం చేసింది. దాదాపు 30 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై మరో పది శాతం అదనపు సుంకాలను సెప్టెంబర్ 1 నుంచి విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని డిసెంబర్ 15 వరకు వాయిదా వేస్తున్నట్టు ఆయన బుధవారం ప్రకటించారు.
ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న ఈ వాణిజ్యపరమైన ఉద్రిక్తతలతో అనేక మంది ఉద్యోగాలుకోల్పోయి రోడ్డున పడుతున్నారని మార్కెట్ నిపుణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇరుదేశాల చర్యల కారణంగా చైనా దిగుమతి చేసుకుంటున్న అమెరికన్ ఉత్పత్తులు జులైలో 19 శాతానికి పడిపోగా, అమెరికాకు పంపే ఎగుమతులు 6.5 శాతం మేర క్షీణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
అదే విధంగా చైనా తమ దేశ కంపెనీలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీచేయాలని తమపై వత్తిడి పెంచుతోందని అమెరికా ఇప్పటికే ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేసింది. రోబోటిక్స్, విద్యుత్ కార్లు, ఇతర టెక్నాలజీలకు సంబంధించి ప్రపంచ స్థాయి సంస్థలతో పోటీ పడేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అమెరికా, జపాన్, ఐరోపా కూటమి, తదితర దేశాలు ఫిర్యాదులుచేస్తున్నాయి. అమెరికా నురచి కొనుగోలు చేస్తున్న సోయాబీన్స్, ఇతర దిగుమతులను తగ్గించుకోవటం ద్వారా తాము అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య మిగులును తగ్గించుకుంటామని చైనా ప్రతిపాదించింది. అయితే ఇతర దేశాలు మాత్రం ఇందుకు నిరాకరిస్తున్నాయి. అమెరికాతో వాణిజ్యం కొన సాగింపుపై చైనా జరుపుతున్న చర్చలకు గత మే నెలలో బ్రేక్ పడిన విషయం తెలిసిందే. తమ మధ్య కుదిరే ఒప్పందం అమ లులోకి వచ్చిన తరువాత పెంచిన టారిఫ్లు తగ్గించాలని చైనా పట్టుబడుతుండగా, అమెరికా మాత్రం ఈ ఒప్పందం అమలు కచ్చితంగా జరిగితేనే తగ్గింపును తాము పరిశీలిస్తామని చెబుతోంది. అయితే చర్చలను పునఃప్రారం భించేందుకు ఇరుదేశాల అధ్యక్షులు ట్రంప్, సీ జిన్పింగ్ అంగీకరించినప్పటికీ తమ వాదనల్లో రాజీ పడేందుకు సిద్ధం కావటం లేదు. ఎటువంటి పురోగతి లేకుండానే తాజా చర్చలు గత నెలలో షాంఘయిలో ముగిసాయి. ఈ నేపథ్యం లో ట్రంప్ సర్కారు దాదాపు 25000 కోట్ల డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై 25 శాతం మేర సుంకాలను పెంచింది. ఇందుకు ప్రతిగా చైనా 11 వేల కోట్ల డాలర్ల విలువైన అమెరికన్ ఉత్పత్తులపై పెనాల్టీలను విధించింది.