Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ట్యునీస్ : ట్యునీషియాలో ఎన్నికల నగారా మోగింది. వచ్చేనెల15న అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేసినట్టు ఇండిపెండెంట్ హై అథారిటీ ఫర్ ఎలక్షన్స్ (ఐఎస్ఐఈ) వెల్లడించింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు 97 మంది నామినేషన్లు దాఖలు చేశారని తెలిపింది. వీరిలో 26 మంది మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులని ఐఎస్ఐఈ అధ్యక్షుడు నబీల్ బఫౌన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశముందని అన్నారు. సరైన నమూనాలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయని అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించామని అన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల31 వరకు తుది గడువు ఉంటుందని అన్నారు.