Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జకార్తా : ఇండోనేషియా రాజధానిని మార్చేందుకు అధ్యక్షుడు జోకో విడోడో కసరత్తు చేస్తున్నారు. ఇండోనేషియా ప్రస్తుత రాజధాని నగరమైన జకార్తా అసౌకర్యంగా ఉన్నదని అభిప్రాయపడుతున్నారు. దేశ రాజధానిని కలిమాంటన్ దీవికి మార్చాలని యోచిస్తున్నామని అన్నారు. ఇండోనేషియా ఆవిర్భవించి 74 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్లమెంట్లో ప్రెసిడెంట్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. 'సమాజంలోని ఆర్థిక అసమానతలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తాం. ఇండోనేషియాను అభివృద్ధి పథంలో నడిపిస్తాం. మన దేశానికి హరిత రాజధాని ఉండాలనే ఉద్దేశంతోనే రాజధానిని మార్చాలని భావిస్తున్నాం. అందుకే కలిమాంటన్ దీవిని ఎంపిక చేయాలని యోచిస్తున్నాం' అని విడోడో అన్నారు. కాగా, కలిమాంటన్ దీవి జకార్తా నగరం నుంచి 1400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జకార్తా నగరంలోనే ప్రభుత్వ భవన సముదాయాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి. దేశ రాజధానిని మార్చాలని విడోడో చేస్తున్న ప్రయత్నాలను ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.