Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్వెట్టా : పాకిస్తాన్లోని క్వెట్టా నగరంలో మసీదుల్లో ప్రార్ధనలు జరిపే మత పెద్ద మహ్మద్ అజామ్ హత్యకు గురయ్యాడని కచ్లక్ పోలీసు అధికారి షఫక్త్ మహ్మద్ తెలిపారు. ఒక కిరాణాస్టోర్ ఎదుట దుండగులు ఆయనపై కాల్పులు జరిపారని ఆయన చెప్పారు. అంతకుముందు శుక్రవారం ఒక మసీదు వద్ద జరిగిన బాంబు పేలుడులో మరో మతపెద్ద మృతి చెందినట్టు వారు తెలిపారు. మతపెద్ద కుర్చీ కింద అమర్చిన బాంబు పేలడంతో ఆయన మృతి చెందాడని, ఈ బాంబు దాడిలో ఆయనతో పాటు మరో ముగ్గురు మృతి చెందగా, 20 మందికి గాయాలయ్యాయని వారు తెలిపారు. దీంతో కొన్ని రోజుల వ్యవధిలోనే క్వెట్టాలో జరిగిన దాడుల్లో ఇద్దరు మత పెద్దలు హత్యకు గురికావడం గమనార్హం. మసీదులో మృతి చెందిన మత పెద్ద మౌలావి అహ్మదుల్లా తాలిబన్ చీఫ్ మౌలవి హిబతుల్లా అఖుంజదాకు మిత్రుడు లేదా బంధువు అని ధ్రువీకరించని వార్తలు చెబుతున్నాయి. తాలిబన్ చీఫ్గా పదవి చేపట్టడానికి ముందు హిబతుల్లా కచ్లక్లోనే నివసించేవాడు. ఆ తరువాత ఆఫ్ఘనిస్తాన్లోని గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్ళాడు. తాలిబన్ ఉగ్రవాదులకు కచ్లక్ బాగా పట్టున్న ప్రాంతం. ఇదే ప్రాంతంలో తాలిబన్ నేత కాకముందు అఖున్జాదా పలు మత పాఠశాలలను నిర్వహించేవాడు. అంతకుముందు శనివారం బలూచ్ నేషనలిస్ట్ పార్టీకి ిచెందిన సీనియర్ నేత, గిరిజనుడు మిర్ అమనుల్లా జెహ్రీ ఒక సాయుధుడు జరిపిన కాల్పుల్లో మరణించాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. గిరిజనుల మధ్య నెలకొన్న ఘర్షణల కారణంగానే అతను హత్యకు గురయ్యాడని జిల్లా అధికారులు తెలిపారు.