Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : దక్షిణ స్పెయిన్ను ఆనుకుని ఉన్న జిబ్రాల్టర్లో స్వాధీనం చేసుకున్న ఇరానియన్ చమురు ట్యాంకర్ గ్రేస్-1ను అమెరికా అధీనంలోకి తీసుకునేందుకు వీలుగా అమెరికన్ కోర్టు వారెంట్ జారీ చేసింది. ఆ నౌకపై ఉన్న దిగ్బంధనాన్ని తొలగిస్తూ బ్రిటిష్ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన వెంటనే అమెరికన్ కోర్టు ఇందులో జోక్యం చేసుకుంది. అమెరికా కోర్టు వారెంట్ జారీ చేసింది. అమెరికా ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరాన్కు చెందిన చమురు ట్యాంకర్ గ్రేస్ 1, అది తీసుకెళ్తున్న 9,95,000 డాలర్ల విలువైన చమురును జప్తు చేసేందుకు కోర్టు వారెంట్ ఇచ్చిందని కొలంబియా డిస్ట్రిక్ట్ అమెరికా అటార్నీ జెస్సీ లీయూ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేస్1 శుక్రవారం తన స్థానాన్ని మార్చుకుంది, కాని దాని లంగరు మాత్రం జిబ్రాల్టర్కు దూరంగా ఉంది. ఈ ట్యాంకర్ను మధ్యధరా సముద్రంలో గత నెల 4న బ్రిటన్కు చెందిన రాయల్ మెరైన్స్ స్వాధీనం చేసుకున్నది. ట్యాంకర్పై తాను విధించిన నిషేధాన్ని జిబ్రాల్టర్ గురువారం ఎత్తివేసినప్పటికీ, అమెరికా దానిని స్వాధీనం చేసుకునేందుకు కోర్టుకు వెళ్ళడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. గ్రేస్-1 చమురు నౌక జిబ్రాల్టర్ మీదుగా వెళ్తున్నప్పుడు అది యూరోపియన్ యూనియన్ ఆంక్షలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ బ్రిటిష్ రాయల్ మెరైన్స్ జులై4న దిగ్బంధించిన సంగతి తెలిసిందే.