Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతీ ఏటా దాదాపు 8 లక్షల మంది మృతి
- ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి
లండన్ : ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ 40 సెకన్లకు ఒకరు బలవంతంగా తమ ప్రాణాలను తీసుకుంటున్నారని 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' ఓ నివేదికలో వెల్లడించింది. నివేదిక ప్రకారం.. మొత్తం మీద ప్రతీ ఏటా సుమారు 8 లక్షల మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇది మలేరియా, రొమ్ము క్యాన్సర్, నరహత్యలు, యుద్ధాల ద్వారా సంభంవించే మరణాల కంటే ఎక్కువ మొత్తంలో ఉన్నదని నివేదిక పేర్కొనడం గమనార్హం.15 నుంచి 29 ఏండ్ల మధ్య వయస్సు వారి మరణాలకు రోడ్డు ప్రమాదాల తర్వాత రెండో ప్రధాన కారణం ఆత్మహత్యలేనని ఈ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఉరి వేసుకోవడం, విషం తీసుకోవడం, గన్లతో కాల్చుకోవడం వంటి చర్యలు అధికమవు తున్నాయనీ, బలవన్మర ణాలను తగ్గించడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలని నివేదిక తెలిపింది. వయస్సు, లింగం, ప్రాంతాలతో తేడాలేకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపింది.
యువకులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడు తున్నారనీ, అలాగే టీనేజీ మయస్సులో తల్లులైన అమ్మయిలు వీరి తర్వాతి స్థానంలో ఉన్నారని నివేదిక వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 2010-16 మధ్య కాలంలో (9.8 శాతం) ఆత్మహత్యలు తగ్గినప్పటికీ పలు ప్రాంతాల్లో గణనీయంగా పెరిగిందని నివేదిక పేర్కొంది. ఉదాహరణకు ఈ కాలంలోనే అమెరికా ప్రాంతాల్లో 6 శాతం బలవన్మరణాలు పెరిగాయని నివేదికలో వెల్లడైంది. ఈ గణాంకాలు ఆందోళన కలిగించేలా ఉన్నా, ఈ విషయంపై పెద్దగా చర్చ జరగడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యానించించడం గమనార్హం. పెరుగుతున్న ఆత్మహత్యల నివారణకు అందరూ కషి చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరుతున్నది. ఈ క్రమంలోనే సెప్టెంబరు 10ని 'ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం'గా ప్రకటించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానమ్ మాట్లాడుతూ.. ఆత్మహత్యల నివారణ అంశాలను 'జాతీయ ఆరోగ్య, విద్యా కార్యక్రమాల'లో చేర్చాలని అన్ని దేశాలకు పిలుపునిస్తున్నామని అన్నారు. పురుగుల మందులను తగ్గించటమనేది ఆత్మహత్యలను సంఖ్యను వేగంగా తగ్గించే అత్యంత ప్రభావవంతమైన మార్గమని చెప్పారు. శ్రీలంకలో మనుషుల ప్రాణాలను హరించే పురుగుల మందులను నిషేంధించిన తర్వాత అక్కడ 70 శాతం ఆత్మహత్యలు తగ్గాయనీ, 1995-2015 మధ్యలో 93 వేల మంది ప్రాణాలు కాపాడబడ్డాయని టెడ్రోస్ తెలిపారు.