Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్విట్టర్లో ప్రముఖ వాణిజ్యవేత్త డిమాండ్
కైరో : ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాఎల్సిసీ తక్షణమే రాజీనామా చేయాలని ప్రముఖ వాణిజ్యవేత్త, నటుడు మహ్మద్ అలీ డిమాండ్ చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఆయన పలు వీడియోలాను పోస్ట్ చేశారు. ఆయన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. 'అవినీతికి పాల్పడిన ఎల్సిసీకి అధ్యక్ష పీఠంలో కూర్చొనే నైతిక అర్హత లేదు. అధ్యక్ష పదవి నుంచి ఆయన వైదొలగాలి. ఆయనను గద్దె దించేంత వరకు నా పోరాటం ఆగదు' అని ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈనెల 23 నుంచి నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. వేలాది మందితో భారీ ర్యాలీ తీస్తామని అన్నారు. కాగా, మహ్మద్ అలీ 15ఏండ్ల పాటు మిలిటరీ కాంట్రాక్టరుగా పని చేశారు. ప్రస్తుతం ఆయన స్పెయిన్లో ప్రవాసముంటున్నారు. ప్రజాధనాన్ని ఎల్ సిసీ దుర్వినియోగం చేశారన్నది మహ్మద్ అలీ ప్రధాన ఆరోపణ. ప్రజల సొమ్ముతో విల్లాలు, భవనాలు, హౌటళ్లు నిర్మించి అధికార దుర్వినియోగానికి పాల్ప డ్డారని మహ్మద్ అలీ ఆరోపించారు. ఇలాంటి వ్యక్తి అధ్యక్షుడి హౌదాలో ఉన్నట్టయితే దేశా భివృద్ధి కుంటు పడుతుందని, అవినీతి కార్యకలాపాలు పెరిగిపోతాయని అన్నారు.