Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి దుండగులు కాల్పులతో కలకలం సృష్టించారు. వాషింగ్టన్ డీసీ వీధుల్లో వైట్హౌస్కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో గురువారం రాత్రి దుండగులు కాల్పులకు తెగబడ్డారని వాషింగ్టన్ పోలీసులు తెలిపారు. ఒక అపార్ట్మెంట్ బ్లాక్లోని పార్కింగ్ స్థలంలో ఈ కాల్పులు జరిగాయని పోలీసులు చెప్పారు. కాగా, ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక అస్పత్రికి తరలించారు. దుండగులు కాల్పులకు పాల్పడ్డ కారణం తెలియరాలేదు. ప్రత్యేక బలగాలు ఘటనాస్థలం వద్ద మోహరించాయి. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాయి. పరిసర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నాయి.