Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోటబయ రాజపక్స
కొలంబో : శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలుపొందినట్టయితే చైనాతో ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరిస్తానని గోటబయ రాజపక్స వెల్లడించారు. 2015లో శ్రీలంక అధ్యక్షుడిగా మైత్రిపాల సిరిసేన ప్రమాణ చేసిన అనంతరం చైనా కంపెనీలతో శ్రీలంకకున్న కాంట్రాక్టులన్నీ రద్దయిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సిరిసేన విధానాలన్నీ చైనాకు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. నవంబర్16న జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఎస్పీపీ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. చైనా, శ్రీలంక దేశాల మధ్య దెబ్బతిన్న ద్వెపాక్షిక సంబంధాలను పునరుద్ధరిస్తానని అన్నారు. చైనా కంపెనీలన్నీ అవినీతికి పాల్పడుతున్నాయని సిరిసేన చేసిన వ్యాఖ్యలను గోటబయ రాజపక్స ఖండించారు. కాగా, దక్షిణ ఆసియాలో అతిపెద్ద టవర్ను నిర్మించాలని శ్రీలంక నిర్ణయించుకుంది. ఈ మేరకు లోటస్ టవర్ నిర్మాణాన్ని చేపడుతోంది. అయితే, ఈ టవర్ నిర్మాణానికి అవసరమైన లోహాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. ఈ లావాదేవీల్లో అవకతవ కలు జరిగాయని సిరిసేన ఆరోపిస్తున్నారు. ఈ టవర్ నిర్మాణానికి అవసరమైన లోహాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. శ్రీలంక ప్రతిపక్ష నేత, మాజీ రక్షణ మంత్రి మహీంద రాజపక్స సోదరుడు గోటబయ. నవంబర్16న జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో గోటబయ రాజపక్సకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయని తాజా సర్వేలు చెబుతున్నాయి. శ్రీలంకలో చెలరేగిన పౌర యుద్ధం 2009లో ముగిసింది. సిన్హాలా బౌద్ధుల జనాభా అధికంగా ఉండటంతో అధ్యక్ష ఎన్నికల్లో గోటమయ గెలుపు దాదాపు ఖాయమనే అంచనాలున్నాయి.