Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 26 మంది మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రావిన్స్ అధికార ప్రతినిధి ఫైజుల్లా ఫిరాఖ్ తెలిపిన వివరాల ప్రకారం......కైబర్ పాక్తున్ఖా ప్రావిన్స్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సైనిక కుటుంబాలకు చెందిన 26 మంది సభ్యులు మృతి చెందారు. బస్సు శార్దౌవ్ నుంచి గిల్గిత్ బాల్టిస్తాన్కు బయల్దేరిన కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పడంతోనే ప్రమాదం సంభవించినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్టు సీఐ అబ్దుల్ వాకిల్ తెలిపారు.