Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హౌడీ మోడీ'కి హాజరైన అధ్యక్షుడు ట్రంప్, టెక్సాస్ సెనేటర్ టెడ్క్రూస్, ప్రవాస భారతీయులు హ్యూస్టన్: అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో ప్రధాని నరేంద్రమోడీకి ఘనస్వాగతం లభించింది. హ్యూస్టన్లో 'హౌడీ మోడీ' పేరుతో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీతోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. టెక్సాస్ సెనేటర్ టెడ్క్రూస్ మోడీని ఆహ్వానించగా రెడ్ కార్పెట్పై నడుచుకుంటూ వేదికపైకి చేరుకున్నారు. వందలాదిగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ట్రంప్ అన్నదేంటీ..
'హౌస్టన్ నగరంలో అట్టహాసంగా ప్రారంభమైన 'హౌడీ మోడీ' కార్యక్రమానికి హాజరైనందుకు గర్వంగా భావిస్తున్నాను. భారత్ మాకు చిరకాలం మిత్రదేశం. నా మిత్రుడు మోడీతో పాటు ఈ కార్యక్రమంలో వేదిక పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉన్నది. ప్రవాస భారతీయులందరినీ అమెరికా అక్కున చేర్చుకుంది. అమెరికన్లతో ప్రవాస భారతీయులకు ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకే మోడీ ఇక్కడికి వచ్చినట్టు నాకు అనిపిస్తున్నది. ప్రవాస భారతీయులంతా అమెరికా సంస్కృతి, సంప్రదాయాలకు జీవం పోసారు. అమెరికన్ల ఉన్నతిని పెంచారు. మాతో మమేకమయ్యారు. భారత్లో పేదరిక నిర్మూలన కోసం మోడీ తీసుకుంటున్న చర్యల గురించి విని ఎంతో గర్విస్తున్నాను. ఉగ్రవాద నిర్మూలన కోసం భారత్తో కలిసి పనిచేస్తాం. ప్రతీ దేశం తమ సరిహద్దుపై నిఘా పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అంతర్గత భద్రతతో పాటు సరిహద్దు భద్రత అత్యంత కీలకంగా మారింది. ఉగ్రవాద నిర్మూలన కోసం రానున్న రోజుల్లో మరింత పటిష్ట చర్యలు చేపడతాం' అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.
ఇవి తెలిస్తే..!!
ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గత ఐదేండ్ల పాలనలో ఏ సమస్యల్ని పరిష్కరించింది..? ఏం సాధించింది..? దేశంలో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇది. ప్రవాస భారతీయులకుగానీ, అమెరికన్లకుగానీ మోడీ పాలనలో జరిగిందేమిటో తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారోనని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. పదేండ్ల యూపీఏ పాలనలో వెలుగు చూసిన అవినీతి ఉదంతాలపై విసుగెత్తిన ప్రజలు మోడీ నేతృత్వంలోని బీజేపీ ఏదో సాధిస్తుందని ఆశపడి 2014లో అధికారం కట్టబెట్టారు. కానీ, మోడీ ఐదేండ్ల పాలనలో గత సమస్యలు కొన్ని మరింత తీవ్రం కాగా, కొత్త సమస్యలు తలెత్తాయి. ఆ సమస్యలకు స్పష్టమైన పరిష్కారాలేమీ చూపకుండానే దాగుడు మూతల సమాధానాలతో దేశ ప్రజల్ని మరోసారి మభ్యపెట్టగలిగారు. 2019 ఎన్నికల్లోనూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చతికిల పడటంతో తిరిగి అధికారంలోకి రాగలిగారు. ఈసారైనా ఆత్మ విమర్శతో ముందుకు వెళ్తారేమోనని ఆశించినవారికి 100 రోజుల పాలన భంగపాటునే మిగిల్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశం ముందున్న తక్షణ సమస్యలేమిటో చూస్తే...
1. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థ : గత ఐదేండ్ల పాలనలో ఆకస్మికంగా తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం, హడావుడిగా జీఎస్టీని అమలులోకి తేవడంలాంటివి ఆర్థిక వ్యవస్థను కృంగదీశాయి. మరోవైపు కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వ బ్యాంకుల వద్ద లక్షల కోట్లు అప్పులు తీసుకొని చేతులెత్తేయడంతో ఖజానా ఖాళీ అయిన దుస్థితి. వేల కోట్లు ఎగవేసిన విజరుమాల్యా, నీరవ్మోడీలాంటివారు విదేశాలకు పారిపోయిన ఉదంతాలు. మందగించిన ఆర్థిక వ్యవస్థ. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేట్ 5 శాతానికే పరిమితమై ఆరేండ్ల కనిష్టానికి చేరుకోవడం అందుకు ఓ నిదర్శనం.
2. ఆకలిచావులు, పౌష్టికాహార లోపం: 2017లో ఐదేండ్లలోపు చిన్నారులు 7 లక్షల 6 వేలమంది మృతి చెందారు. వీరిలో 68 శాతం చిన్నారులు పౌష్టికాహార లోపం వల్లే చనిపోయారని జాతీయ, అంతర్జాతీయ సంస్థల సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు, ఐదేండ్లలోపు చిన్నారుల్లో 8 కోట్ల 30 లక్షలమంది రక్తహీనతతో బాధపడుతున్నట్టు తేలింది. 3 కోట్లమంది తక్కువ బరువుతో జన్మించారు. ఐదున్నర కోట్లమంది వయసుకు తగిన ఎత్తు లేరు. 2 కోట్ల 20 లక్షలమంది వయసుకు తగిన బరువు లేరు. మొత్తమ్మీద 4 కోట్ల 60 లక్షలమంది తక్కువ బరువుతో బాధపడుతున్నారు. ఇవన్నీ పౌష్టికాహార లోపానికి నిదర్శనాలు. వీరేకాదు, పిల్లలకు జన్మనిచ్చే (15-49) వయసులోని మహిళల్లో 19 కోట్ల 50 లక్షలమంది రక్తహీనతతో బాధపడుతున్నారు.
3- నిరుద్యోగ సమస్య: ప్రభుత్వ లెక్కల ప్రకారం 2017-18లో దేశ నిరుద్యోగిత 6.1 శాతానికి చేరుకున్నది. భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం(సీఎంఐఈ) సర్వే ప్రకారం ఈ ఏడాది ఆగస్టులో దేశ నిరుద్యోగిత 8 శాతంపైనే ఉన్నట్టు తేలింది. నిరుద్యోగుల సంఖ్య 4 కోట్ల 20 లక్షలు. వీరిలో 2 కోట్ల 80 లక్షలమంది(68 శాతం) 20 నుంచి 29 ఏండ్ల మధ్య వయస్కులు. 2017 జనవరి నుంచి 2019 ఏప్రిల్ వరకు అదనంగా చేరిన నిరుద్యోగుల సంఖ్య కోటీ 10 లక్షలు. ఇది మోడీ పాలనాతీరుకు మచ్చుతునక.
4-గృహ నిర్బంధంలో కాశ్మీరీలు: గత నెల 5న మోడీ సర్కార్ 370 అధికరణాన్ని రద్దు చేయడంతో కాశ్మీర్లోని దాదాపు 70 లక్షలమంది ప్రజలు ఇండ్లు విడిచి బయటకు రాలేనిస్థితికి నెట్టబడ్డారు. కనీస పౌరహక్కులకు కూడా నోచుకోని స్థితిని వారు ఎదుర్కొంటున్నారు. 25,000కుపైగా పారా మిలటరీ బలగాల పహారా మధ్య కాశ్మీరీ పౌరులు వీధుల్లోకి రాలేని దుస్థితి. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేకపోతున్నారు. ధైర్యం చేసి అడుగు బయటకు వేసినా తిరిగి ఇంటికి చేరే వరకూ భయావహ వాతావరణం. అనారోగ్యానికి గురైనవారిని ఆస్పత్రిలో చేర్పించేందుకూ జంకుతున్నట్టు స్థానిక మీడియా నుంచి కథనాలు. ఇప్పటివరకూ 722 నిరసన సంఘటనలు నమోదు కాగా, భద్రతా దళాల చర్యల్లో పలువురు పెల్లెట్ల దాడిలో గాయపడి బాధపతున్నారు. పలు రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు జైలు పాలయ్యారు. భూతల స్వర్గంగా పేరున్న కాశ్మీర్ నేడు ప్రపంచలోనే అతిపెద్ద జైలుగా మారిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
5-మూకదాడులు: మోడీ అధికారం చేపట్టిన తర్వాత గోసంరక్షకుల పేరుతో మూకదాడి సంఘటనలు పెరిగాయి. మొత్తం 90 సంఘటనలు రికార్డు కాగా, దాడులకు గురైన బాధితుల సంఖ్య 292. మృతుల సంఖ్య 36. హిందూత్వ భావజాలం, మూకదాడుల పట్ల అసమ్మతి తెలుపుతూ సభలు, సమావేశాలు జరిపేవారిని అడ్డుకున్న సంఘటనల్ని ఈ రికార్డుల్లో చేర్చలేదన్నది గమనార్హం.
6-కుల దురహంకార దాడులు: మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2016 వరకు అగ్రకుల దుర హంకారులు దళితులు, ఆదివాసీలపై జరిపిన దాడుల సంఖ్య 1,39,301గా నమోదైంది. ఆ తర్వాత ప్రభుత్వం దేశంలో జరుగుతున్న నేరాలపై అధికారిక రికార్డులను నిలిపివేసింది.
'హౌడీ మోడీ' అసలు రహస్యం..!
ప్రధాని మోడీ దాదాపు రెండు సంవత్సరాల తరువాత అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని టెక్సాస్ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం వలన దేశానికి అటు వాణిజ్యపరంగా, ఇటు దౌత్యపరంగా ఏం ప్రయోజ నం కలుగుతుందనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. రాజ్యాంగ ప్రసాదించిన హక్కులను కాలరా యడంపై మేధావులు, విశ్లేషకులు మండిపడుతున్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం అను సరిస్తున్న విధానాల వలన ప్రస్తుతం దేశంలో ఆర్థిక మాం ద్యం తీవ్రంగా ఉంది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి డిమాండ్ తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రెండు సంద ర్భాల వలన మోడీ ఇమేజ్పై దెబ్బ పడింది. ఈ నేపథ్యంలో వీటి నుంచి దేశంతో పాటు అంతర్జాతీ యంగా జరుగు తున్న చర్చను పక్కదారి పట్టించేందుకు మోడీ ఈ కార్యక్ర మాన్ని ఉపయోగించు కున్నారు. పెద్దయె త్తున హంగా మాగా ఈ హౌడీ మోడీ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా మీడియా, ప్రజల దృష్టిని కాశ్మీర్, మాంద్యం అంశా లపై నుంచి మళ్లిం చేందుకు ప్రయత్నిం చారు. దీంతో పాటు ఇది వరకు భార త ప్రధానులెవ్వరూ అమెరికా అధ్యక్షుడితో కలిసి బహిరంగ సమావేశంలో పాల్గొనలేదు. మొదటిసారిగా ట్రంప్తో కలి సి మోడీ పాల్గొంటున్న ఈ సమావేశం ద్వారా తన ఇమేజ్ ను తిరిగి పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
ఎన్నికల్లో లబ్ధి కోసం ట్రంప్
ట్రంప్ అంశాన్ని పరిశీలిస్తే.. వచ్చే ఏడాదిలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు ఎదురీత తప్పదని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే డెమొక్రటిక్ పార్టీకి చెందిన జోరు బిడెన్ 2020 ఎన్నికలకు సంబంధించి ముందంజలో ఉన్నారనీ, ప్రస్తుతం ఆయనకు రెండంకెల ఓట్ల శాతం ఆధిక్యం ఉందని పామర్ నివేదిక పేర్కొంది. టెక్సాస్ నగరంలో ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో ఉంటారు. గత ఎన్నికల్లో టెక్సాస్ రాష్ట్రంలో ట్రంప్కు చెందిన రిపబ్లికన్ పార్టీ 9 శాతం మెజార్టీ సాధించింది. అయితే గత మూడు సంవత్సరాలుగా ట్రంప్ అనుసరిస్తున్న నిరంకుశ విధానాల వలన ఆయనపై ఈ ప్రాంతంలో కూడా వ్యతిరేకత పెరిగింది. గత కొన్నేళ్లుగా ఈ రాష్ట్రంలో భౌగోళిక పరిస్థితులు మారాయి. ఇక్కడి వలస వచ్చి చేరుతున్న వాళ్లలో అత్యధికులు ఆసియా అమెరికన్లు ఇంకా ముఖ్యంగా భారతీయులు ఉన్నారు. సాధారణంగా ప్రవాసభారతీయులు డెమోక్రాట్లకు మద్దతుగా ఉంటారు. ఈ నేపధ్యంలో టెక్సాస్ రాష్ట్రంలో తన కాళ్ల కిందకు నీళ్లు వస్తున్నాయని గమనించిన ట్రంప్ రానున్న ఎన్నికల్లో మోడీని వినియోగించుకొని ప్రవాస భారతీయుల ఓట్లను పొందే వ్యూహంలో ఉన్నారని సమాచారం. గత అనుభవాలను పరిశీలిస్తే ట్రంప్ అనే వ్యక్తి అంత నమ్మదగిన స్నేహితుడిగా కనిపించడం లేదు. దీనికితోడు గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్కు మోడీ సర్కార్ మద్దతు ఇచ్చింది. అయితే అప్పుడు ట్రంప్ విజయం సాధించారు. రానున్న ఎన్నికల్లో ట్రంప్కు ఎదురీత తప్పదని ఇప్పటికే పలు సర్వేలు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్కు మద్దతుగా వ్యవహరించడం భారత్కు దౌత్యపరంగా ఎంతవరకూ లాభం అనే అంశంపై మోడీ సర్కార్ అలోచించిందా అనే ప్రశ్న తలెత్తుతోంది.