Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 మంది పోలీసులు మృతి, 9 మందికి గాయాలు
వాషింగ్టన్: మెక్సికోలోని మిచోకాన్ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా పంజా విసిరింది. ఓ కేసు విచారణ నిమిత్తం కోర్టు కు వెళ్తున్న పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని దుండ గులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 14 మంది పోలీ సులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 9 మంది గాయ పడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తు న్నారు. గత కొన్ని నెలలుగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న, వినియోగిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపా దం మోపుతున్నారు. మాదక ద్రవ్యాల రవాణాకు అడ్డుపడినట్టయితే మారణహౌమం సృష్టిస్తామని దుండగులు పోలీ సులను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కాల్పుల ఘటన చోటు చేసుకోవడంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతు న్నాయి. పోలీసులపై దాడి చేయటం పిరికిపంద చర్యని.. రహదారిపై వెళ్తున్న వారిపై ఆకస్మికంగా దాడులు చేసి మట్టు పెట్టారని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై మెక్సికో గవర్నర్ ఆండ్రీస్ మాన్యుయేల్ లోపేజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.