Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనామా: బహ్రెయిన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సల్మా బాద్ అనే పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో మంటలు చెలరేగడంతో భారీగా ఆస్తినష్టం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 16 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశా రు. ముందుజాగ్రత్త చర్యగా పరిశ్రమ ఆవరణలో ఉన్న ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటన అక్టోబరు15న చోటుచేసుకొంది. అయితే ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు స్పందించారు. కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని, ఎవ్వరూ చనిపోలేదని వివరణ ఇచ్చారు.