Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా, దక్షిణ మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయ కార్యదర్శి
వాషింగ్టన్: భారత్లో దళితులకు, మైనార్టీలకు రక్షణ కరువైందని అమెరికా, దక్షిణ మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయ కార్యదర్శి అలైస్ వెల్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు భారత్లో చోటుచేసుకోవడం విచారకరమని అన్నారు. ఇవి ఇలాగే కొనసాగినట్టయితే భారత న్యాయవ్యవస్థ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. గోరక్షకుల పేరిట దళితులపై, ముస్లింపై దాడుల ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని అన్నారు. భారత్లోని మైనార్టీలు,దళితులు అభద్రతా భావంలో జీవిస్తున్నారని అన్నారు. ఇలాంటి హింసాత్మక ఘటనల నిర్మూలనకు భారత ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. భారత ప్రభుత్వం మూక దాడులకు అడ్డుకట్టవేయాలని కోరారు. భారత్ పలు రంగాల్లో అమెరికాకు భాగస్వామిగా ఉండటం గర్వకారణమేనని, అక్కడి మైనార్టీలపై, దళితులపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వం వారి హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న మతమార్పిడి నిరోధక చట్టాలు భారత్లో మైనార్టీలకు చట్టం కల్పిస్తున్న హక్కులకు విఘాతం కలిగిస్తున్నాయని ఆరోపించారు. భారత్లోని బలహీనవర్గాలు మతస్వేఛ్ఛహక్కును పూర్తిగా వినియోగించు కునేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అసోంలోని సుమారు 1.9 మిలియన్ల మంది పౌరసత్వం ప్రశ్నార్థకంగా మారిందని, ఇలాంటి చర్యలను ఖండిస్తున్నట్టు అలైస్ వ్యాఖ్యానించారు.