Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2014 నుంచి ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్
నైరోబీ: కెన్యాలో ఆరోగ్య కార్యకర్తలు సమ్మెకు దిగారు. 2014 నాటి నుంచి ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కెన్యా లోనితవేటా కౌంటీలో నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, దంతవైద్యులు, ఫార్మసిస్ట్లతో సహా వేలాది మంది ఆరోగ్య కార్యకర్తలు సమ్మెలో పాల్గొన్నారు.దీంతో 83 రకాల ఆరోగ్య సేవలపై ప్రభావం పడింది. విధులనుంచి తొలగిస్తామని కౌంటీ ప్రభుత్వం బెదిరించినా.. వైద్యులు సమ్మెలో కొనసాగుతూనే ఉన్నారు. ఈ సమ్మెకు కెన్యా నేషనల్ యూనియన్ ఆఫ్ నర్సెస్ (కేఏఎన్యూఎన్), కెన్యా యూనియన్ ఆఫ్ క్లీనికల్ ఆఫీసర్స్, కెన్యా మెడికల్ ప్రాక్టీషనర్స్, ఫార్మసిస్ట్స్ అండ్ డెంటిస్ట్స్ యూనియన్ (కేఎంపీడీయూ) కెన్యా కౌంటీ ప్రభుత్వ వర్కర్స్ యూనియన్, కెన్యా హెల్త్ ప్రొఫెషనల్ సొసైటీ, కెన్యా యూనియన్ ఆఫ్ లాబొరేటరీ టెక్నీషియన్స్లు మద్దతు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగా వైద్యుల ప్రతినిధి మాట్లాడుతూ.. గత సమ్మెలో ప్రభుత్వానికి, యూనియన్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని సర్కార్ ఉల్లంఘించినట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఒప్పందం ప్రకారం.. బకాయిలను నవంబర్ మొదటి వారంలోగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, ఇప్పటివరకూ తమ జీతాలను చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తిరిగి సమ్మెను ప్రారంభించామని తెలిపారు. వైద్యరంగంలో నియామకాలున్నా.. 2014 నాటి నుంచి ఎవ్వరికీ పదోన్నతులు రాలేదని తెలిపారు. ఆరోగ్య కార్యకర్తల ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి కౌంటీ ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్లో రూ. 4.2 కోట్లను కేటాయించినప్పటికీ, పూర్తి స్థాయిలో బకాయిలను చెల్లించలేదని విమర్శించారు. ఇప్పటి వరకూ కేవలం రూ. 2 కోట్ల పాత బకాయిలను మాత్రమే చెల్లించినట్టు తెలిపారు. 16 నెలలుగా కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదనీ, తమ బకాయిలను చెల్లించాలని కోరితే.. బెదిరిం పులకు పాల్పడు తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా, ఒప్పందం ప్రకారం.. కార్మికులకు నేషనల్ హాస్పిటల్ ఇన్సూరెన్స్ ఫండ్, నేషనల్ సోషల్ సెక్యూరిటీ ఫండ్, ఇతర ఇన్సూరెన్స్ ప్రీమియంలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు.