Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ చర్యల్ని తప్పుబట్టిన కాంగ్రెస్ ప్రతినిధులు
వాషింగ్టన్ : జమ్మూకాశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై అమెరికా చట్టసభ 'కాంగ్రెస్' ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. వాషింగ్టన్లో జరుగుతున్న 'యుఎస్ కాంగ్రెస్' మానవ హక్కుల సమావేశాల్లో కాంగ్రెస్ ప్రతినిధులు కాశ్మీర్పై భారత ప్రభుత్వ చర్యల్ని తప్పుబట్టారు. 'ద టామ్ లాంటాస్' నేతృత్వంలోని ద్విసభ్య కమిషన్ అక్టోబరు22 నాటి సమావేశాల్లో కొంతమంది సాక్ష్యుల్ని విచారించి, కాశ్మీర్ విషయంలో కొన్ని చర్య లు చేపట్టాలని సూచించింది. రెండోసారి జరిగిన ఈ సమావేశాల్లోనూ కాశ్మీర్పై కాంగ్రెస్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేయటం గమనార్హం. మానవ హక్కుల పరిరక్షణలో చర్యలు చేపట్టాలని కమిషన్ మరోమారు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కమిషన్ వెబ్సైట్లో విడుదలైన ప్రకటన ఇలా ఉంది...''టామ్ లాంటాస్ ద్విసభ్య కమిషన్ కాశ్మీర్లో మానవ హక్కులపై విచారణ జరిపింది. ఇరు వర్గాల ప్రతినిధుల నుంచి వాదనలు విన్నది. జమ్మూకాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోకముందు, కోల్పోయాక మానవ హక్కుల పరిస్థితుల్ని కమిషన్ తెలుసుకునే ప్రయత్నం చేసింది'' అని పేర్కొన్నారు. కాశ్మీర్లో పౌరులు, రాజకీయ నాయకులపై కొనసాగుతున్న నిర్బంధంపై కాంగ్రెస్లో డెమొక్రాట్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. డెమొక్రాట్ ఎంపీలు షీలా జాక్సన్, డేవిడ్ ట్రోన్, డేవిడ్ సిసిల్లీన్ మోడీ సర్కార్ చర్యల్ని తప్పుబట్టారు.
'కాశ్మీర్ లేకుండా భారత్ లేదు'
వాషింగ్టన్ వేదికగా మానవహక్కుల మీద జరుగుతున్న 'యుఎస్ కాంగ్రెషనల్' సమావేశాల్లో భారత్ తరఫున ప్రముఖ కాలమిస్ట్ సునందా వశిష్ట్ పాల్గొన్నారు. కాశ్మీర్ జోలికొస్తే ఊరుకునేది లేదంటూ ఈ సందర్భంగా ఆమె గట్టిగా హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆమె ఏమన్నారంటే...''ఒకప్పుడు పంజాబ్, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు ఎదురై మానవ హక్కులకు విఘాతం కలిగింది. అప్పుడు దాన్ని సమర్థంగా నియంత్రించాం. ఇప్పుడు ఉగ్రవాదమనే తిరుగుబాటుపై వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. దీంట్లో భారత్ను బలపర్చాల్సిన సమయం వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో మద్దతు అవసర''మని ఆమె అన్నారు.
నిర్బంధంలోనే !శ్రీనగర్: నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా సోదరి ఖలీదా షా, తమ్ముడు షేక్ ముస్తఫా కమల్, ఆయన మేనల్లుడు ముజాఫర్ అహ్మద్షాలు మూడు నెలల అనంతరం మొదటి సారి తమ ఇండ్ల నుంచి బయటకి వచ్చారు. కానీ సాయంత్రం మళ్లీ గృహనిర్బం ధించబడ్డారు. దీనిపై ఖలీదా షా మాట్లాడుతూ.. ఆర్టికల్ 370, జమ్మూకాశ్మీర్ విభజన నేపథ్యంలో తమ కుంటుం బాన్ని గృహ నిర్బంధం లో ఉంచారని తెలిపారు. గురువారం నుంచి తమకు స్వేచ్ఛను కల్పిస్తున్నట్టు అధికారులు సెక్యూరిటీ గార్డులకు తెలిపారన్నారు. ఈ సమయంలో మీడి యా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదనీ వారు ఆదేశించినట్టు వెల్లడించారు. అయితే సాయంత్రం మళ్లీ తమను గృహనిర్బంధంలోకి తీసుకున్నారని ఆమె తెలిపారు.