Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెక్సికో: విద్యుత్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీల్లో అత్యంత కీలకమైన లిథియం ఖనిజ నిక్షేపాలపై ఇప్పుడు సామ్రాజ్యవాద దేశాల క న్ను పడింది. లాటిన్ అమెరికాలోని బొలీవియా, అర్జెంటీనా, చిలీ తదిత ర దేశాలలో వున్న ఈ అపార ఖనిజ నిక్షేపాలకోసం సామ్రాజ్యవాద దేశా లు వ్యూహాత్మకంగానే లాటిన్ అమెరికా దేశాలపై కత్తి దూస్తున్నాయి. చిలీ లో 2016 నాటి గణాంకాల ప్రకారం అల్బెమార్ల్, సోసిదాద్ క్విమికా డి మినరల్స్ డి చిలీ అనే ప్రయివేటు కంపెనీలు 68,874 టన్నుల లిథియం కా ర్బొనేట్ ఖనిజాన్ని వెలికి తీసినట్టు తెలుస్తోంది. ఇందులో సోసిదాద్ కంపెనీలో 29 శాతం వాటాలున్న శతకోటీశ్వరుడు జులియో పోన్స్ లెరూ ఫోర్స్బ్ కంపెనీ రూపొందించిన ప్రపంచ శతకోటీశ్వరుల జాబితాలో 42 2వ ర్యాంక్లో నిలిచాడు. ఆ సమయంలో ప్రపంచ లిథియం మార్కె ట్లో చిలీకి 33శాతం వాటా వుంది. అదే సంవత్సరంలో అర్జెంటీనాకు చెం దిన ఎఫ్ఎంసి కార్పొరేషన్, ఓరోకోబెర్ సంస్థలు 30,340 టన్నుల లిథియంను ఉత్పత్తి చేసి ప్రపంచ మార్కెట్లో 16 శాతం వాటాను దక్కించుకున్నాయి.