Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆంక్షల ఎత్తివేతపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడి నిరాకరణ
టెహ్రాన్: ఇరాన్తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, ఇరాన్పై కొనసాగుతున్న ఆంక్షల ఎత్తివేత అంశంపై మాత్రం చర్చించేందుకు ఆయన నిరాకరించారు. దీంతో, చర్చలకు ఆస్కారం కన్పించడంలేదు. కాగా, గత పది రోజులుగా అమెరికాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలకాలని ఇరాన్ యోచిస్తున్నట్టు ఆదివారం సంకేతాలు వెలువడ్డాయి. మరోవైపు చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని అమెరికా తెలిపింది. ఈ నేపథ్యంలో ఇరాన్ మేజర్ జనరల్ సులేమానీ హత్య తరవాత పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు సద్దుమణిగే సూచనలు కనిపిస్తున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా రక్షణశాఖ మంత్రి మార్క్ ఎస్పర్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికీ ఇరాన్తో చర్చలకు సిద్ధంగానే ఉన్నారని ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా ఇరాన్తో సమావేశానికి అమె రికా ఆసక్తి చూపుతున్నప్పటికీ ఆంక్షలు ఎత్తివేస్తేనే తాము చర్చలకు వస్తామని ఇరాన్ వాదిస్తోందన్నారు.
ఇది ఆరంభమే..
-బాగ్దాద్లోని యూఎస్ సైనిక స్థావరాలపై దాడులపై హెజ్బొల్లా నేతలు
బాగ్దాద్లోని యూఎస్ సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణుల దాడులకు పాల్పడటంపై లెబనాన్కు చెందిన హెజ్బొల్లా గ్రూపు నేతలు స్పందించారు. ఇది ఆరంభం మాత్రమేనని అభిప్రాయపడ్డారు. ఇరాన్ ఆర్మీ చీఫ్ సులేమానిని అమెరికా హతమార్చడాన్ని సీరియస్గా తీసుకున్నామని అన్నారు. రానున్న రోజుల్లో అమెరికాపై మరిన్ని ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించారు. భవిష్యత్లో ఇరాన్ చేయనున్న దాడులన్నీ అమెరికాకు చెంపపెట్టులా ఉంటాయని హెజ్ బొల్లా నేత హస్సన్ నస్రల్లా విమర్శించారు. మధ్యప్రాఛ్యం నుంచి అమెరికా బలగాలన్నీ వైదొలిగే రోజులు ఆసన్నమయ్యాయని అన్నారు. యూఎస్ బలగాలను మధ్యప్రాఛ్య దేశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహిం చొద్దని ఆయన కోరారు. మధ్యప్రాఛ్య దేశాల్లో ఇకపై అమెరికా జోక్యం చేసుకోకుండా యూఎస్ సైనికులను తరిమికొడతామని హెచ్చరించారు.
దాడులపై అమెరికా ఆగ్రహం
ఇరాక్లో అమెరికా సైనిక స్థావరాలపై ఆదివారం జరిగిన దాడిని అగ్రరాజ్యం తీవ్రంగా ఖండించింది. తాజా చర్య పట్ల ఆ దేశ విదేశాంగమంత్రి మైక్ పాంపియో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడి వెనక ఉన్న వారిని వీలైనంత త్వరగా పట్టుకోవాలని ఇరాక్ ప్రభుత్వాన్ని కోరారు. ఇరాక్ ప్రభుత్వానికి విధేయులుగా లేని కొంతమంది ఆ దేశ సార్వభౌమత్వంపై తరచూ దాడి చేస్తున్నారని.. దీనికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇరాక్లో అమెరికా బలగాలు మోహరించిన ఒక సైనిక స్థావరంపై ఆదివారం మరోసారి రాకెట్ దాడి జరిగింది. బాగ్దాద్ సమీపంలోని అల్-బలాద్ వైమానిక స్థావరంపై ఆదివారం 8 రాకెట్లు పడ్డాయి. ఇందులో ఇరాక్ వైమానిక దళానికి చెందిన నలుగురు గాయపడ్డారు. ఇక్కడ కొద్ది సంఖ్యలో అమెరికా సైనికులు, కాంట్రాక్టర్లు ఉన్నారు. ఇరాన్తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అమెరికా బలగాలు దాదాపుగా ఈ స్థావరాన్ని ఖాళీ చేశాయి. ఇరాన్ సైన్యమై ఈ దాడికి పాల్పడిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుమానిస్తున్నారు. కాగా, ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధంలేదని ఇరాన్ పేర్కొంది.