Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఏఏకి వ్యతిరేకంగా ప్రధాని మహతీర్ వ్యాఖ్యలే కారణం
కౌలాలంపూర్: మలేషియా దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించింది. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా మలేషియా ప్రధాని మహతీర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీఏఏ కారణంగా విదేశాల నుంచి భారత్కు వచ్చే ముస్లింలకు ఇబ్బందులు తప్పవని ఆయన విమర్శించారు. భారత ప్రభుత్వ చర్యల కారణంగా కాశ్మీరీల హక్కులకు భంగం వాటిల్లుతోందని అన్నారు. మహతీర్ వ్యాఖ్యలను భారత్ సీరియస్గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. మలేషియా నుంచి భారత్కు పామాయిల్ దిగుమతులు అధికంగా ఉంటాయి. వీటిపై భారీ ఆంక్షలు మోపింది. భారత నిర్ణయంపై మహతీర్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత నిర్ణయంతో తాము తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని అన్నారు. కాగా, దౌత్యపరమైన చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మలేషియా ట్రేడ్స్ యూనియన్ కాంగ్రెస్ ఇరు దేశాలను కోరింది. గతేడాది మలేషియా నుంచి 4.4 మిలియన్ టన్నుల పామాయిల్ను భారత్ దిగుమతి చేసుకుంది. తాజా ఆంక్షల నేపథ్యంలో ఈ దిగుమతులు ఒక మిలియన్ టన్నులకు పడిపోయే అవకాశం ఉన్నట్టు భారత వ్యాపార వర్గాలు అభిప్రాయపడ్డాయి.