Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో : జపాన్ పర్యావరణ మంత్రి, మాజీ ప్రధాని జునిచిరో కైజూమీ తనయుడు షింజీరో కైజూమీ( 38) సంచలన నిర్ణయం తీసుకున్నారు. సెలవులపై మూడు వారాలపాటు వెళ్లనున్నట్టు మీడియా సమావేశంలో ప్రకటించారు. భార్య శిశువుకు జన్మనివ్వనున్న తరుణంలో తానీ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఈ నేపథ్యంలో క్యాబినేట్, పార్లమెంట్ సమావేశాలకు హాజరవలేనని అన్నారు. అవసరమైతే మూడు నెలల పాటు తాను ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశంలేదని అన్నారు. కాగా, జపాన్లో శిశు మరణాలు అధికంగా నమోదవుతున్నాయి. పిల్లల సంరక్షణ పట్ల తల్లిదండ్రులు అశ్రద్ధ కనబరుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమాజానికి ఆదర్శంగా నిలవాలని కైజూమీ నిర్ణయించుకున్నారు. కైజూమీని ఆశావహ ప్రధాని అభ్యర్థిగా జపాన్లో భావిస్తున్నారు. యువనేతగా, సమర్థనేతగా ఆయనకు మంచిపేరుంది.