Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత దేశానికి 2025 నాటికి ఎస్-400 క్షిపణులను సరఫరా చేస్తామని రష్యా మిషన్ డిప్యూటీ చీఫ్ రోమన్ బబుష్కిన్ శుక్రవారం తెలిపారు. భారత్కు అందజేయనున్న ఎస్-400 మిస్సైల్స్ ఉత్పత్తి ప్రారంభమైందని ఆయన అన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మార్చి22 నుంచి రెండు రోజులపాటు రష్యాలో పర్యటించనున్నారు. రష్యా-భారత్-చైనా త్రైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఎస్-400 మిస్సైల్స్ ఇప్పటి వరకూ రష్యా రక్షణ శాఖకు మాత్రమే అందు బాటులో ఉండేవి. తొలిసారిగా మన దేశ రక్షణకు అండగా నిలుస్తున్నాయి.