Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : సురీల్ దాబావాలా (33) అనే ప్రవాస భారతీయ యువతి అమెరికాలో మృతి చెందింది. చికాగోలోని లయోలా యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్న ఆమె గతేడాది డిసెంబరు 30న అదృశ్యమైంది. ఆమె తండ్రి అష్రాఫ్ దాబావాలా పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా తన కుమార్తె ఆచూకీ తెలిపిన వారికి 10 వేల డాలర్ల రివార్డు కూడా ప్రకటించారు. తాజాగా తన సొంత కారులోనే విగతజీవిగా పడివున్న సురీల్ను ఓ ప్రయివేట్ డిటెక్టివ్ ఏజెన్సీ గుర్తించింది. చికాగో పరిసరాల్లో కారు ఢిక్కీలో సురీల్ మృతదేహం దుప్పట్లో చుట్టి ఉంది. సురీల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే కేసులో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఈకేసులో నిందితులను అరెస్ట్ చేయలేదని అన్నారు.