Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మయన్మార్తో ద్వైపాక్షిక సంబంధాలు
- 1.3బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం : జిన్పింగ్
యాంగాన్ : బెల్డ్ అండ్ రోడ్ నిర్మాణంలో భాగంగా మయన్మార్ లోని రఖైన్ రాష్ట్రం లో ఓడరేవును నిర్మించనున్నట్టు చైనా అధ్య క్షుడు జిన్పింగ్ తెలి పారు. మయన్మార్తో ద్వై పాక్షిక సంబం ధాలను బలో పేతం చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు 1.3బిలియన్ డాలర్ల (రూ. 9,239 కోట్టు) పెట్టుబడులను మయన్మార్లో పెట్టనున్నట్టు తెలిపారు. చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మయన్మార్లో జిన్పింగ్ పర్యటించడం ఇదే తొలిసారి. జిన్పింగ్ రాకతో తమ దేశంలోని పలు అంతర్గత సమస్యలకు కూడా పరిష్కారం లభించే అవకాశముందని మయన్మార్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. కాగా, మయన్మార్లోని రఖైన్ రాష్ట్రంలో నివసిస్తున్న రోహింగ్యా ముస్లింలపై 2016లో మయన్మార్ ఆర్మీ హింసాకాండకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 24వేల మంది రోహింగ్యా ముస్లింలు మృతిచెందగా, లక్షలాది మంది ప్రాణభయంతో ఇతర దేశాలకు వలసవెళ్లారు. మయన్మార్ ఆర్మీ దాడుల్లో చిన్నారులు, మహిళలు, వృద్ధులు మృతిచెందారు. వందలాది ఇండ్లకు నిప్పంటించిన మయన్మార్ ఆర్మీ రోహింగ్యాలను నిరాశ్రయులను చేసింది. మయన్మార్ కౌన్సెలర్, నోబెల్ శాంతి పురస్కారం గ్రహీత అంగ్సాన్ సూకీపై కూడా అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆర్మీ అరాచకాలను అరికట్టడంలో ఆమె ఘోరంగా విఫలమయ్యారని, రోహంగ్యాలపై దాడులు జరుగుతుంటే ప్రేక్షక పాత్ర పోషించారనే విమర్శలు వచ్చాయి.
మయన్మార్ అధ్యక్షుడు విన్మింట్తో భేటీ : మయన్మార్ అధ్యక్షుడు విన్మింట్తో జిన్పింగ్ భేటీ అవుతారని అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. ఈ భేటీలో అంగ్సాన్ సూకీ, కమాండర్ ఇన్ చీఫ్ మిన్ అంగ్ హ్లయింగ్, రవాణా శాఖ డిప్యూటీ మంత్రి అంగ్ హుటూ కూడా పాల్గొంటారని తెలిపింది.