Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖాట్మండ్ : నేపాల్ సందర్శనకు వెళ్లిన 8 మంది భారతీయులు అక్కడి హోటల్ రూమ్లో విగత జీవులుగా కనిపించారు. వారిని ఎయిర్ అంబులెన్స్లో ఖాట్మండ్లోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన 15 మంది హాలిడే కోసం నేపాల్ వెళ్లారు. అక్కడ ఎవరెస్ట్ పనోరమ హోటల్లో 4 రూమ్లను బుక్ చేసుకున్నారు. వారిలో ఎనిమిది మంది ఒక రూమ్లో.. మిగిలినవారు ఇతర రూమ్ల్లో ఉన్నారు. ఒక రూమ్లో ఉన్న 8 మంది గదిలో వెచ్చదనం కోసం గ్యాస్ హీటర్ను ఆన్ చేశారు. అయితే అది సరిగా పనిచేయకపోవడంతో గ్యాస్ లీకైంది. దీంతో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారడంతో వారు మృతి చెందినట్టుగా తెలుస్తోంది.