Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దావోస్: భూమిని రక్షించేందుకు సరైన చర్యలు జరగడం లేదని పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు సందర్భంగా స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించింది 17 ఏండ్ల గ్రెటా. తన ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నప్పటికీ... భూమిని కాపాడేందుకు చేపట్టిన చర్యలు మాత్రం శూన్యమని తెలిపింది. 'ఒక రకంగా చూస్తే పర్యావరణం అంశంలో చాలా మార్పు వచ్చింది. అనేక ప్రాంతాల నుంచి ఈ ఉద్యమానికి మద్దతు లభిస్తోంది. ఇది ఒక పెద్ద అడుగు. ఈ విషయంపై ఇప్పుడు ప్రజల్లో ఓ అవగాహన ఏర్పడింది. పర్యావరణమే ఇప్పుడు హాట్ టాపిక్. యువత వల్లే ఇది సాధ్యపడింది. వారికి ధన్యవాదాలు. మరోవైపు నుంచి చూస్తే.. పర్యావరణ పరిక్షణకు అసలేం జరగలేదు. కర్బన ఉద్గారాలను కట్టడి చేయడానికి ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వాటిని కట్టడి చేయడం మా ఉద్యమంలోని ప్రధాన అంశాల్లో ఒకటి' అని థన్బర్గ్ పేర్కొంది. గ్రెటాతోపాటు ఈ కార్యక్రమంలో జాంబియా, ప్యూర్టో రికోకు చెందిన యువ పర్యావరణవేత్తలు నటాషా వాన్స, సాల్వెడార్ జీ మెజ్, కెనడా చీఫ్వాటర్ కమిషనర్ ఆటమ్ పెల్టియర్ పాల్గొన్నారు.