Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టెహ్రాన్ : ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసీం సులేమాని హత్యకు ఇరాన్ ప్రతీకారం తీర్చిన వారికి భారీ బహుమానం ఇస్తామని ఆదేశ ఎంపీ అహ్మద్ హమ్జే ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను చంపినట్టయితే మూడు మిలియన్ డాలర్లు బహూకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈనెల 3న బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన సులేమాని కాన్వారుని లక్ష్యంగా చేసుకొని అమెరికా క్షిపణుల దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో ఆయన మృతి చెందారు. ఇరాన్లో సులేమాని స్వస్థలమైన కెర్మాన్ గ్రామం ఉన్న కహ్నౌజ్ ప్రాంతానికి అహ్మద్ హమ్జే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హమ్జే ప్రకటనపై అమెరికా ప్రతినిధి రాబర్ట్ఉడ్ స్పందించారు. ఇదో అర్థరహిత ప్రకటన అని పేర్కొన్నారు. ఇరాన్ ప్రకటన అక్కడి ఉగ్రవాదానికి ఉదాహరణ అని తెలిపారు.