Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి31న బాధ్యతలు
ఏథెన్స్ : గ్రీస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా ప్రముఖ న్యాయమూర్తి ఎకాటెరీనీ సాకెల్లారోపౌలు (63) ఎన్నిక య్యారు. మెజారిటీ పార్లమెంట్ సభ్యులు ఆమె ఎన్నికకు మద్దతు తెలిపారు. ఆమె ఎన్నికకు సంబంధించి అధికార కన్జర్వేటీవ్ పార్టీ సభ్యులు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు 261 మంది పార్లమెంట్ సభ్యులు మద్దతు తెలపగా, 39 మంది వ్యతిరేకించారు. ప్రస్తుత అధ్యక్షుడు ప్రొకోపిస్ పావ్లోపౌలస్ పదవీ కాలం మార్చి13న ముగియనుంది. అదే రోజున పావ్లోపౌలస్ నుంచి ఎకాటెరీనీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎకాటెరీసీకు న్యాయశాస్త్రంలో అపార పరిజ్ఞానం ఉన్నది. ఆమె తండ్రీ సాకెల్లారోపౌలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడంతో బాల్యం నుంచే ఆమె కూడా న్యాయశాస్త్రంపై ఆసక్తి కనబరిచేవారు. పర్యావరణ పరిరక్షణ అంశంపై వందలాది ఆర్టికల్స్ రాశారు. ప్రజలను చైతన్యపరిచేందుకు అనేక చోట్ల ఉపన్యాసాలు ఇచ్చారు. కాన్స్టిట్యూషన్ లా లో ఆమెకు అపార పరిజ్ఞానం ఉన్నది. ఇదిలా ఉండగా, జర్మనీ చాన్సెలర్గా 2005లో ఏంజెలా మెర్కెల్ ఎన్నికయ్యారు. అత్యంత ప్రభావితురాలైన మహిళగా ఫోర్బ్స్ జాబితాలో ఆమె చోటు సంపాదించుకున్నారు. వచ్చే ఏడాది వరకు ఆమె పదవిలో కొనసాగనున్నారు. గతేడాది డిసెంబర్లో అతి చిన్న వయసులో ప్రధాని బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా ఫిన్లాండ్కు చెందిన 34 ఏండ్ల సనా మారిన్ ఎన్నికయ్యారు.