Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : కాశ్మీరు సమస్య పరిష్కారానికి భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వం వహించాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరిన నేపథ్యంలో భారత దేశం ఘాటుగా స్పందించింది. పాక్ తన మాటలను కట్టిపెట్టి, దౌత్య సంబంధాలను సజావుగా కొనసాగించే అంశంపై దృష్టిపెట్టాలని పిలుపునిచ్చింది. ఐరాసలో భారత దేశ ఉప శాశ్వత ప్రతినిథి నాగరాజునాయుడు 74వ ఐరాస సాధారణ సభ సమావేశంలో మాట్లాడారు. చేప నీటిలోకి వెళ్ళినట్టుగానే ఓ ప్రతినిథి బృందం మళ్లీ విద్వేషపూరిత ప్రసంగానికి ఒడిగట్టిందని చెప్పారు. ఈ ప్రతినిథి బృందం ఎప్పుడు మాట్లాడినా విషం చిమ్ముతూ ఉంటుందన్నారు. ఇటువంటి మాటలను ప్రపంచం పట్టించుకోదన్నారు.
ఇమ్రాన్ దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో మాట్లాడుతూ తాము భారత దేశంతో శాంతిని కోరుకుంటున్నట్టు తెలిపారు. చర్చల ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామన్నారు. అణ్వాయుధ సామర్థ్యంగల రెండు దేశాల మధ్య ఇటువంటి సున్నితమైన సంబంధాలు ఉండకూడదని, అందుకే తాను నియంత్రణ రేఖ వద్దకు అంతర్జాతీయ పరిశీలకులు రావాలని కోరుతున్నానని చెప్పారు.