Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాడ్రిడ్: స్పెయిన్లో గ్లోరియా తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ధాటికి 11 మంది మృతి చెందారు. మరో నలుగురు గల్లంతయ్యారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. వందలాది ఇండ్ల పైకప్పులు గాల్లో ఎగిరిపోవడంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ఐరోపాలోని పర్యటక ప్రదేశాలు, సముద్రతీర ప్రాంతాలు దెబ్బతిన్నాయి. మరికొన్ని పట్టణాల్లో వరదలు సంభవించాయి. తుఫాను దృష్ట్యా దెబ్బతిన్న ప్రాంతాలను ప్రధాని పెడ్రో శాంచెజ్ పర్యటించారు. తక్షణమే ప్రభుత్వ సాయం అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అధికార యంత్రాంగం సక్రమంగా పనిచేసేలా అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. 2018లో మల్లోర్కాలోని హాలిడే ద్వీపంలో సంభవించిన వరదలకు 13 మంది మృతిచెందారు.