Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 31 మంది మృతి
సనా : యెమెన్పై వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో 31 మంది పౌరులు మృతిచెందారు. మరో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ శరణార్థి సంస్థ ధ్రువీకరించింది. ఈ ఘటన యెమెన్ ఉత్తర ప్రావిన్స్లోని అల్ జాఫ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న పలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, శనివారం యెమెన్లో సౌదీ జెట్ కూలిపోయింది. సౌదీ జెట్ను తామే కూల్చినట్టు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీకారంగానే ఈ దాడులు జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సౌదీ సంకీర్ణదళాలే ఈ దాడికి పాల్పడ్డాయని యెమెన్ ఆర్మీ పేర్కొంది. దీనిపై సౌదీ స్పందించలేదు.