Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : చైనాతోపాటు ప్రపంచ దేశాలను కొవిడ్-19 ( కరోనా వైరస్) ముప్పు వణికిస్తోంది. కోవిడ్ కారణంగా ఇప్పటికే 1669 మంది మృతిచెందగా, ప్రపంచవ్యాప్తంగా 69 వేల మందికిపైగా ఈ వైరస్ బారిన పడ్డారు. చైనా వెలుపల కూడా కోవిడ్ వల్ల మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యాధి బారినపడిన వారికి చికిత్స అందించడానికి, వ్యాధిని నయం చేయడానికి చైనా రకరకాల మార్గాలను అన్వేషిస్తోంది. కానీ వైరస్ అదుపులోకి రాకపోవడంతో శతాబ్దాల క్రితం నాటి సంప్రదాయ వైద్య విధానంవైపు మొగ్గు చూపుతోంది. ఉహాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి సంప్రదాయ వైద్యమైన టీసీఎంను కూడా చైనా అందిస్తోంది. ఈ విషయాన్ని హుబేరు ప్రావిన్స్ హెల్త్ కమిషనర్ వాంగ్ హెషెంగ్ వెల్లడించారు. ఇప్పటికే సగం మంది రోగులకు టీసీఎంను అందించామన్నారు. దీని వల్ల కొంత పురోగతి కూడా కనిపించిందని వాంగ్ తెలిపారు. టీసీఎం చికిత్స అందించే 2200 మందిని హుబేరు పంపామన్నారు. వాంగ్ హుబేరు ప్రావిన్స్ హెల్త్ కమిషన్ నూతన చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొవిడ్-19 బారిన పడిన వారిని గుర్తించడంలో సిటీ స్కాన్లను కూడా చేర్చారు.