Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జపాన్ మంత్రి కాటో వెల్లడి
టోక్యో: కరోనా క్వారంటైన్ నౌక డైమండ్ ప్రిన్సెస్లో ఇన్ఫెక్షన్ లేదని తేలిన 23 మంది శనివారం సాయం త్రం బయటకు వచ్చిన ప్పటికీ, వారికి ఫిబ్రవరి 5లోగా పరీక్షలు జరపకపోవటం తో మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించేందు కు ప్రయత్నిస్తున్నామని జపాన్ ఆరోగ్య మంత్రి కట్సునోబు కాటో చెప్పారు. కరోనా ఇన్ఫెక్షన్ సోకిన ఒక నౌక నుంచి బయటకు వచ్చేందుకు ఒక మహిళను అనుమతించటంపై ఆయన క్షమాపణ చెప్పారు. క్వారంటైన్ నౌకలో రెండు వారాలు ఉన్న 60ఏండ్ల వయసున్న ఈ మహిళ డైమండ్ ప్రిన్సెస్ నౌక నుంచి బుధవారం బయటకు వచ్చినప్పటికీ తోచిగి ప్రిఫిక్చెర్లో జరిగిన మరో పరీక్షలో ఆమెకు ఇన్ఫెక్షన్ ఇంకా నివారణ కాలేదని నిర్ధారణ అయింది. నౌకలో ఉన్న 23 మందికి ఈ నెల 5లోగా ఈ కరోనా పరీక్షలు నిర్వహించకపోవటంతో తాము వారికి మరోసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ పరిస్థితి తలెత్తినందుకు తాము తీవ్రంగా విచారిస్తున్నామని, ఇన్ఫెక్షన్ పునరావృతం కాకుండా ఉండేందుకు డబుల్ చెక్స్ వంటి చర్యలు చేపడతామని ఆయన వివరించారు. దాదాపు 3,700 మందికి పైగా ప్రయాణీకులు, సిబ్బంది ఉన్న ఈ డైమండ్ ప్రిన్సెస్ నౌక యొకహోమా హార్బర్లో ఈ నెల 3 నుంచి క్వారంటైన్లో ఉన్న విషయం తెలిసిందే.