Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ప్రజలకు ఇజ్రాయిల్ డిఫెన్స్ మినిస్టర్ లేఖ
- హలో.... నా పేరు నఫ్తాలీ బెన్నెత్, ఇజ్రాయిల్ డిఫెన్స్ మినిస్టర్ని
నేను మీ అందరితో కరోనా మహమ్మారికి సంబంధించి ఒక ముఖ్యమైన అంతర్గత విషయాన్ని పంచుకుంటున్నాను. కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే అందరూ టెస్టింగ్ టెస్టింగ్ టెస్టింగ్ అంటూ పరుగెడుతున్నారు. లేదంటే సామాజిక దూరం గురించి మాట్లాడుతున్నారు. ఈ రెండింటికంటే అత్యంత ప్రధానమైనది ముసలివాళ్లను, పసి పిల్లలను వేరు చేయడం. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత ప్రాణాంతకమైన కలయిక ఏంటంటే తాత/అమ్మమ్మ/నాన్నమ్మ తమ మనువళ్లను/మనుమరాళ్లను కౌగిలించుకోవడం. ఎందుకు? కరోనా వైరస్కు ఉన్న ప్రత్యేకత వల్ల అది వయస్సులో ఉన్న వారికంటే వయస్సు మళ్లినవాళ్లకే ప్రాణాంతకంగా ఉంటోంది. ఇప్పటి వరకు సంభవించిన కరోనా మరణాల్లో వయస్సులో ఉన్న వారి (30ఏండ్ల లోపు) శాతం సున్నా లేదా 1శాతంగానే ఉంది. కానీ కరోనా వైరస్ సోకిన ముసలివాళ్లలో (70-80ఏండ్లవారు) ప్రతి ఐదుగురిలో ఒకరు చనిపోయారు. మరిప్పుడు మనం ఏం చేయాలి? మన తాత/అమ్మమ్మ/నానమ్మల పట్ల మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే అదికూడా అత్యంత దూరం నుంచే. వారితో సంభాషించేందుకు వాట్సాప్, ఫేస్బుక్ వంటి మీకు ఇష్టమున్న, నచ్చిన యాప్స్ను ఉపయోగించుకోవాలి. వారికి అన్నం బాక్సులు, ప్లేట్స్ ఇచ్చే ముందు మీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. భోజనం తరువాత వారి బాక్సులు తీసుకెళ్లే ముందు కూడా మీరు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఎట్టి పరిస్థితుల్లో వారి గదుల్లోకి ప్రవేశించొద్దు. వారిని కౌగిలించుకోవద్దు. అలా చేస్తే మీరు వారిని ప్రమాదపుటంచుల్లోకి నెట్టినవాళ్లవుతారు. చివరగా చాలా మంది నన్ను అడుగుతున్నారు. 'ముసలివాళ్లను ఎప్పటికీ దూరంగానే ఉంచాలా? అని. దానికి నా సమాధానం 'కాదు'అని. క్రమంగా, కొన్ని నెలల్లోనే, మిగిలిన ప్రజలందరికీ, వారు వద్దనుకున్నా కరోనా వైరస్ సోకుతుంది. మెజారిటీ ప్రజలకు వచ్చే మూడు నాలుగు వారాల్లోనే కరోనా వైరస్ సోకుతుంది. అయితే వారికి ఆ వైరస్ సోకినట్టు కూడా తెలియదు. నాలుగు వారాల తరువాత వారికై వారే బాగైపోతారు. అప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు ఇండ్లలోంచి బయటకు రావొచ్చు. అయితే ఇందుకు ఒక నెల పట్టొచ్చు. లేదా రెండు, మూడు అంతకంటే ఎక్కువ నెలలు పట్టొచ్చు.
ఇదే మన ప్రణాళిక .. గుడ్ లక్మన అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలను జాగ్రత్తగా చూసుకోండి. వారికి దగ్గరగా వెళ్లకండి.