Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జైళ్లలో సౌకర్యాలపై ఇజ్రాయిల్ నిర్లక్ష్యం...
గాజా: ఇజ్రాయిల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలు తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్నా...జైళ్లలో ఉన్న తమ గురించి అధికారులెవరూ పట్టించుకోవటంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలేమీ పాటించడం లేదు. దీంతో స్వీయ రక్షణకు వాడాల్సిన వస్తువులను కూడా నిరాకరిస్తున్నారు. హమాస్ సంస్థకు చెందిన ఖైదీలకు ఇస్తున్న అల్పహారాన్ని, భోజనాలు తీసుకోవటం లేదు. హమాస్ ప్రస్తుతం ''గాజా'' పట్టణాల్లో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన సభ్యులు.. ఆ జైళ్లల్లోనే ఉన్న ''ఫతా'' సంస్థకు చెందిన వారు కూడా ఆహారాన్ని తిరస్కరిస్తున్నారు. పాలస్త్తీనియన్ ఆథారిటీ సంస్థ ఆధీనంలో ఉన్నా.. ఇజ్రాయిల్ పాలకులకు ఏ మాత్రం పట్టడంలేదు. పరిస్థితులు ఇలానే కొనసాగితే నిరాహార దీక్షలకు సన్నద్ధమవ్వాలని భావిస్తున్నారు. పాలస్తీనా ఖైదీలకు ఇంత వరకూ ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించలేదు, స్వీయ రక్షణకు అవసరమైన వస్తువులను ఇవ్వలేదు. మాస్కులు ఇవ్వాలని అడిగితే సాక్స్లను వాడుకొండని ఉచిత సలహాలు ఇస్తున్నారు. నిర్బంధంలో ఉన్న పాలస్తీనీయన్లలో 1000 మంది తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వారిలో రోగనిరోధక శక్తి తక్కువగ ఉండే అవకాశం ఉన్నది. దాంతో వారికి ఈ వైరస్ సోకే ప్రమాదం ఎక్కువ స్థాయిలో ఉన్నది. అయినా జాత్యాంహకారం కలిగిన యూదులు పాలస్తీయన్లను గడ్డిపోచతో సమానంగా చూస్తున్నారు. ఇప్పటికే అక్కడ కోవిడ్..19 వైరల్ పాజిటివ్ కేసులు రెండు నమోదయ్యాయి. పరిస్థితులు ఇలానే ఉంటే...పాలస్తీనా ఖైదీల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.