Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్రాంక్ఫర్డ్ ఆమ్ మెయిన్ : కరోనా వైరస్ వల్ల భవిష్యత్లో సంభవించే ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొవాలోనన్న ఆందోళనే ఓ ఆర్థిక మంత్రిని మింగేసింది. జర్మనీలోని హెస్సీ రాష్ట్ర ఆర్థికమంత్రి థామస్ షాఫెర్ (54) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర మినిస్టర్ ప్రెసిడెంట్ వోల్కర్ బౌఫియర్ తెలిపారు. రైల్వే ట్రాక్ సమీపంలో థామస్ మృతదేహాన్ని గుర్తించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు ధ్రువీకరించారు. మేం షాక్లో ఉన్నాం..నమ్మలేకపోతున్నాం. మాకు ఎంతో బాధగా ఉన్నది. హెస్సీ ఆర్థిక మంత్రిగా థామస్ పదేండ్లుగా పనిచేస్తున్నారు. కోవిడ్..19 మహమ్మారి ధాటికి ఏర్పడిన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవటానికి తీవ్రంగా శ్రమించారని వోల్కర్ తెలిపారు.