Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది 2019, డిసెంబర్ 31. మరి కొన్ని గంటల్లో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రపంచంలోని అనేక దేశాలు అప్పటికే ఆ సంబరాల్లో మునిగిపోయాయి. ఆ సమయంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయానికి ఒక అత్యవసర వర్తమానం అందింది. అది చైనా నుంచి! తమ దేశంలో విస్తరిస్తున్న అంతుపట్టని ఒక వ్యాధి గురించి ఆ సందేశంలో చైనా వివరించింది. న్యూమోనియా తరహా లక్షణాలతో ఒక వ్యాధి తమ దేశంలో శరవేగంగా విస్తరిస్తోందనీ, ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం కనిపించడం లేదని మరణాలు పెద్ద ఎత్తున చోటుచేసుకుంటున్నాయన్నది ఆ వర్తమానంలో చైనా పేర్కొంది. నిజానికి అప్పటికి కొద్ది రోజుల ముందే చైనాలోని వుహాన్ నగరంలో కరోనా రక్కసి పురుడుపోసుకుంది. ఒకరు, ఇద్దరుతో మొదలైన ఆ వ్యాధి చూస్తుండగానే వందలు, వేలల్లోకి వ్యాపించింది. సాధారణ ప్రజానీకం కండ్లముందే పిట్టలులాగా రాలిపోవడం ప్రారంభమైంది. ఆ పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితికి నూతన ప్రాణంతక వైరస్ గురించి నివేదించిన చైనా, తనదైన శైలిలో ఆ వైరస్పై యుద్దం ప్రారంభించింది! అది మామూలు పోరాటం కాదు. సర్వ శక్తులు కేంద్రీకరించి... ప్రపంచం విస్తుపోయేలా జనం కోసం చైనా సమరం చేసింది. కోటిమంది ఉన్న వూహాన్ నగరానికి తాళం వేసింది. వారందరిని పోరాటంలో భాగస్వామ్యం చేసింది. ఊపిరితిత్తులను కబళించే కరోనా (కోవిడ్-19) వైరస్కు ఊపిరి అందకుండా చేసింది. వైరస్ను అంతం చేయడానికి ఇప్పుడు భారత్తో పాటు, ప్రపంచమంతా అనుసరిస్తున్న మార్గం అదే! అదే చైనా మార్గం!
వుహాన్: కరోనా పై పోరాటానికి చైనా ఎంచుకున్న మార్గం సులభమైనదేమి కాదు. భయం, బాధ, కష్టాలు, కన్నీండ్లు ఇవ్వన్నీ కలగలిసిన పోరాటమది! అంతవరకు ప్రపంచం కని,వినీ ఎరగని యుద్దమది! ప్రాణాలు హరించడమే లక్ష్యంగా శత్రువు విరుచుకుపడుతున్నప్పుడు రెండడుగులు వెనక్కి వేసి, మాటు చూసుకునీ, నలువైపులా ముట్టడించి, శత్రువును ఉక్కిరిబిక్కిరి చేసి, తరిమికొట్టే వ్యూహమది! అప్పుడెప్పుడో రెడ్ఆర్మీ సాగించిన లాంగ్మార్చ్లో ఈ తరహా వ్యూహాన్ని ఎన్నో సార్లు అమలు చేసి శత్రువును వెంటాడి, వేటాడిన చరిత్ర చైనాది! మళ్ళీ ఇన్నేండ్ల తరువాత .. ! వైరస్ వ్యాపించకుండా వ్యూహాన్ నగరాన్ని రోజుల తరబడి మూసివేసి, అదే సమయంలో చైనాలోని అన్ని ప్రాంతాల్లో సుశిక్షితులైన వైద్యులను, నర్సింగ్ సిబ్బందితో పాటు సమస్త శాస్త్ర సాంకేతిక వ్యవస్థలను అక్కడకు తరలించి యుద్ధం చేసింది! మానవాళి మనుగడకు దారి చూపిన ఈ యుద్దంలో చైనా చూపిన తెగువను చూసి ప్రపంచ ఆరోగ్య సంస్థే విస్తుపోయింది. ఆ తరహా పోరాటమే మానవజాతిని కాపాడుతుందని ప్రకటించింది.
ప్రారంభం ఇలా...
చైనాలోని అనేక రాష్ట్రాలలో హుబెరు ఒకటి! ఆ రాష్ట్రంలో వుహాన్ నగరం అత్యంత ప్రధానమైనది. నిజానికి చైనాలోనే అత్యంత కీలక నగరాల్లో ఇది ఒకటి! అనేక పరిశ్రమలు, విద్యా సంస్థలకు నిలయం.. ఆ కారణం చేతనే వివిధ దేశాలకు చెందిన వారు కూడా ఇక్కడ కనిపిస్తారు. డిసెంబర్ నెల మధ్యలో ఈ నగరంలోనే కరోనా వైరస్ పుట్టింది. జలుబు, దగ్గు వంటి లక్షణాలతో అనేకమంది ఆస్పత్రులకు రావడం ప్రారంభమైంది. ప్రారంభంలో వైద్యులు దీనిని మాములు ఫ్లూగానే భావించారు. సాధారణ మందులే ఇచ్చారు. కానీ, ఫలితం కనిపించకపోవడంతో పాటు, వ్యాధి మరింతమందికి విస్తరించడం, మరణాలు చోటు చేసుకోవడంతో పరిస్థితి తీవ్రత అర్ధమైంది. ఈ క్రమంలోనే ఐక్యరాజ్యసమితికి విషయాన్ని నివేదించారు. మరోవైపు కొత్త వైరస్ లక్షణాలను అధ్యయనం చేసి, కరోనా జాతికి చెందినదిగా నిర్ధారించారు. దీనికి గరిష్టంగా 14 రోజుల ఆయుర్థాయం ఉంటుందని తేల్చారు. ఈ నిర్ధారణ జరిగే సమయానికే వుహాన్లో వేలాదిమంది వైరస్ బారిన పడ్డారు. దీంతో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వుహాన్ మార్కెట్ మూత పడింది. అత్యంత ఉత్సాహంగా జరిగే కొత్త సంవత్సర ఉత్సవాలు వెలవెలబోయాయి. వుహాన్తో పాటు, చైనా అంత ప్రజల కదలికలపై జనవరి నెల ప్రారంభానికే పాక్షిక ఆంక్షలు ప్రారంభమయ్యాయి.
అందరూ వుహాన్కే...
మహమ్మారి బారిన పడుతున్న వేలాది మందిని కాపాడు కోవడం, అదే సమయంలో వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించ కుండా చూడటమన్నది చైనా వ్యూహంలో కీలకాంశాలు. ఈ రెండు లక్ష్యాలు అమలు కావాలంటే లాక్డౌన్ నూటికి నూరుశాతం అమలు జరగడంతో పాటు, పెద్ద ఎత్తున వైద్య సేవలు అవసరమౌతాయి. దీనిని చైనా ప్రభుత్వం, ప్రజలు ఒక సవాల్గా తీసుకున్నారు. లాక్డౌన్తో పాటే విస్తృతంగా పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏ ఒక్కరినీ వదల కుండా పరీక్షలు చేశారు. దీంతో లాక్డౌన్ ప్రకటిం చిన రెండు రోజు ల్లోనే రోజుకు వేలాది మందికి పాజిటివ్ కేసులు వెలుగులోకి రావడం ప్రారం భమైంది. ఇంత మందికి వైద్యసేవలు అందించడమంటే, ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి! ఈ కష్టాన్ని ఒక నినాదం సుసాధ్యం చేసింది. అదే ..'అందరూ వుహాన్కే.. అన్నీ వూహాన్కే..'! లాక్డౌన్ ప్రకటించిన మొదటిరోజే చైనా నలువైపుల నుంచి 10వేల మంది వైద్య సిబ్బంది వుహాన్కు చేరుకున్నారు. మరుసటి రోజు మరో 30 వేల మంది చేరుకున్నారు.
ప్రాణాలు కాపాడే వైద్య పరికరాలన్నీ వుహాన్ బాటపట్టాయి. చైనాలోని సమస్త పారిశ్రామిక సంస్థలు వుహాన్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఉత్పత్తులు ప్రారంభించాయి. మాస్క్లు, వెంటిలేటర్ల ఉత్పత్తి భారీగా సాగింది. మరోవైపు రోగుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. అనుమానితులు పెద్ద సంఖ్యలో రావడం ప్రారంభించారు. నగరంలో ఉన్న పది ఆస్పత్రులు నిండిపోయాయి. ఈ ప్రమాదాన్ని ముందుగానే ఊహించి చైనా ప్రభుత్వం 1,000 పడకలతో చేపట్టిన ఆస్పత్రి నిర్మాణాన్ని పదిరోజుల్లో పూర్తి చేశారు. డబ్య్లూహెచ్ఓ ప్రమాణాల మేరకు నిర్మాణమైన ఈ ఆస్పత్రి నిర్మాణం ఒక రికార్డు! ఐసీయూ సేవల కోసం దీనిని ప్రత్యేకంగా కేటాయిం చారు. స్టేడియాలు, హోటళ్లు, ఎగ్జిబిషన్ గ్రౌండ్లలో యుద్ధపాతిపదికన క్వారంటైన్లను నిర్మించారు. అయినా, పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉండటంతో అప్పటికే చేరుకున్న వైద్య సిబ్బంది ఏ మాత్రం చాలని పరిస్థితి ఏర్పడింది. దీంతో, అధ్యక్షుడు జిన్పింగ్ 10 వేలమంది ఆర్మీ వైద్య బృందాన్ని ప్రత్యేక విమా నంలో తరలిం చారు. సాధా రణ పరీక్షల్లో రోగ నిర్ధా రణలో తీవ్ర జాప్యం జరుగు తుండటంతో, లాభం లేదని అందరికీ సిటి స్కాన్ చేయిం చారు. దీనికోసం పెద్ద సంఖ్యలో సిటిస్కాన్ యంత్రాలను వుహాన్కు చేర్చారు.
వుహాన్కు తాళం ఇలా...!
పాక్షిక ఆంక్షలు వైరస్ను కట్టడి చేయడంలో ఆశించిన ఫలితం చూపడం లేదని అర్ధమైంది. మరో వైపు పాజిటివ్ కేసులు వందల నుంచి వేలల్లోకి చేరాయి. మరణాలు వందల్లోకి చేరాయి. ప్రజల్లో ఎక్కడ చూసినా భయం! ఎవరిని కదిలించినా కన్నీండ్లే! వాణిజ్య సముదాయాలు ఒకటొకటిగా మూతపడుతు న్నాయి. వీటికన్నా ముందే విద్యాసంస్థలు మూతపడా ్డయి. ఒకదాని తరువాత ఒకటిగా పరిశ్రమలు మూతపడుతు న్నాయి. ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు ఒక కారణమైతే, ప్రజల్లో నెలకొన్న భయం దీనికి మరో కారణం. ఈ పరిస్థితుల్లోనే వైరస్కు సంబంధించిన అనేక రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో చైనా అత్యున్నత నాయక త్వపు మేథో మథనం ప్రారంభమైంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్వయంగా ఈ సమావేశాల్లో పాల్గొన్నారని చెబుతారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలోనే ప్రపంచం ఇంతవరకు కనీవినీ ఎరుగని యుద్దానికి రూపకల్పన జరిగిందే. అదే వూహాన్ లాక్డౌన్! అంతే జనవరి 23న వుహాన్ నగరానికి తాళం పడింది!
యుద్ధం చేసిన వైద్య సిబ్బంది...
కరోనాతో వైద్య సిబ్బంది యుద్ధం చేశారు. నిద్ర, ఆహారాల సంగతి సరే, ముఖానికి తొడుక్కున్న మాస్క్లు తీయడానికి కూడా రోజుల తరబడి సిబ్బందికి సమయం దొరకలేదు. దీంతో వారి ముఖాలపై మాస్క్ల ముద్రలు అలాగే పడిపోయాయి. దీంతో ముఖాల మీద గాయాలైనాయి. అయినా, దూదితో గాయాన్ని కప్పిపెట్టి, మళ్లీ మాస్క్లు తొడుక్కుని వైద్యం చేశారు కానీ, వెనకడుగు వేయలేదు. ఇక, వుహాన్లో అడుగుపెట్టిన మొదటిరోజే 40 వేల వైద్య సిబ్బంది మొబైల్ఫోన్లను పక్కనపెట్టేశారు. తిరిగి వెనక్కి ప్రయాణమయ్యేంతవరకు ఆ ఫోన్లను తాకనే లేదు. అన్ని రోజులు పిల్లలతో, జీవిత భాగస్వామితో కనీసం మాటలు కూడా లేవు. ఒకే బెడ్మీద ఇద్దరు ముగ్గురు పడుకున్నారు. బెడ్లు దొరక్కపోతే ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ పడుకుని నిద్రపోయారు. ఈ నిద్ర కూడా అరకొరే! ఏ క్షణంలో పిలుపువచ్చినా ఆస్పత్రికి పరుగెత్తడానికి సిద్ధంగా ఉండేవారు. ఇక ఆహారం విషయంలోనూ అంతే. ముందు రోగులకు ప్రాధాన్యత. ఆ తరువాత మహిళా సిబ్బందికి. వీరందరికి పోను మిగిలితేనే పురుష సిబ్బంది తినేవారు! ఈ క్రమంలో 3వేల మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. 12 మంది మరణించారు. అయినా, బాధితులకు వైద్యం అందించాలన్న లక్ష్యాన్నుంచి వారు ఒక్కడుగు కూడా పక్కకు వేయలేదు. చివరకు ఈ కష్టం ఫలిచింది. వుహాన్లో కరోనాపై చేసిన యుద్దంలో వారు విజేతలుగా నిలిచారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నిర్ధారించింది. ఈ విజయమే ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలిచింది.