Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢాకా : కరోనాతో బంగ్లాదేశ్ రక్షణ శాఖ కార్యదర్శి అబ్దుల్లా అల్ మోసిన్ చౌదరి మరణించారు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వం సోమవారం ధ్రువీకరించింది. ఢాకాలోని కంబైన్డ్ మిలటరీ హాస్పిటల్(సీఏంహెచ్)లో చికిత్స పొందుతూ ఉదయం 9.30 గంటలకు తుది శ్వాస విడిచారని రక్షణ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సెలినా హాక్ వెల్లడించారంటూ స్థానిక మీడియా పేర్కొంది. ఆయనకు కరోనా వచ్చినట్టు తేలడంతో గత నెల 29న సిఎంహెచ్లో చేర్చారు. ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో జూన్ 6న ఐసీయూలోకి మార్చారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 18న వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నారు. జనవరిలో రక్షణ కార్యదర్శి పదవిని చేపట్టిన ఆయన..ఈ నెల 14న రక్షణ శాఖలో సీనియర్ కార్యదర్శిగా పదోన్నతి కల్పించింది. బంగ్లాదేశ్లో ఇప్పటి వరకు 1,37, 787 కరోనా కేసులు నమోదు కాగా, 1738 మంది ప్రాణాలు కోల్పోయారు.