Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెనీవా : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ ఇప్పట్లో ముగిసిపోదని, రానున్న కాలంలో అది మరింత తీవ్రం కానుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అథనోమ్ హెచ్చరించారు. కరోనా వైరస్ చైనాలో వెలుగుచూసి ఆరు నెలలు గడిచింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా బారిన పడిన వారి సంఖ్య కోటి దాటగా, మృతుల సంఖ్య 5 లక్షలపైగానే ఉంది. ఈ సందర్భంగా ఆన్లైన్ మీడియా సమావేశంలో టెడ్రోస్ మాట్లాడారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు సమగ్ర వ్యూహంతో ముందుకు కదలాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.