Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపసంహరించుకోవాలన్న యుఎన్హెచ్ఆర్సీ చీఫ్ మిచ్చెల్లీ
జెనీవా : వెస్టుబ్యాంకు అక్రమణకు సంబంధించి ఇజ్రాయిల్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రణాళికలు పూర్తిగా చట్టవిరుద్ధమని ఐరాస మానవ హక్కుల సంఘం(యుఎన్హెచ్ఆర్సీ) చీఫ్ మిచ్చెల్లీ బచేలెట్ అన్నారు. దీని వలన రానున్న కాలంలో వినాశకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సోమవారం ఒక ప్రకటనలో ఆమె హెచ్చరించారు. ఇజ్రాయిల్ చర్యలను ఖండిస్తూ వెస్టుబ్యాంకు స్థావరాలు, జోర్డాన్ వ్యాలీని ఆక్రమించుకోవాలన్న ప్రణాళికలను ఉపసంహరించుకోవాలని ప్రధాని బెంజిమెన్ నేతన్యాహూను కోరారు. ' వెస్టుబ్యాంకులో అక్రమణ అనేది 30 శాతం కావచ్చు లేదా అది 5 శాతం కావచ్చు. ఏదేమైనా ఇటువంటి చర్యలు పూర్తిగా చట్టవిరుద్ధం' అని బచేలెట్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇజ్రాయిల్కు చెందిన మాజీ అధికారులు, జనరల్స్ చెప్తున్న అంశాలను వినాలి. అదే సమయంలో ఇటువంటి ప్రమాదకరమార్గంలో ప్రయాణించవద్దని హెచ్చరిస్తూ ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న గొంతుకలను పరిగణనలోకి తీసుకోవాలి' అని నేతన్యాహూకు సూచించారు.
మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొల్పే పేరుతో అమెరికాలోని ట్రంప్ సర్కార్ ఒక శాంతి ప్రణాళికను ప్రతిపాదించింది. దీంతో అమెరికాకు వంతపాడే ఇజ్రాయిల్ ఈ ప్రతిపాదనలను అమలు చేసేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా జులై 1 నుంచి వెస్టుబ్యాంకులోని స్థావరాలను ఆక్రమించుకుంటామని ఇప్పటికే ప్రకటించింది. కాగా, ట్రంప్ ప్రతిపాదనలను పాలస్తీనియన్లు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నారు. ఆయన చేసిన ప్రతిపాదనలు వెస్టుబ్యాంకులోని ప్రధాన స్థావరాలను ఆక్రమించుకునేందుకు ఇజ్రాయిల్కు అనుమతి ఇచ్చినట్టుగా ఉన్నాయని, అయితే ఈ స్థావరాలను అంతర్జాతీయ సమాజం అనేక కాలంగా చట్టవిరుద్ధంగా పేర్కొంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో వైఖరి మార్చుకోవాలని బచేటెల్ ఇజ్రాయిల్ను కోరింది. ఈ అక్రమణల పరిణామాలు దశాబ్ధాల కాలం పాటు ఉంటాయని, దీని కారణంగా అటు ఇజ్రాయిల్కూ, ఇటు పాలస్తీనాకూ తీవ్ర నష్టం చేకూరుస్తుందని తన ప్రకటనలో అభిప్రాయపడ్డారు.