Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాచిన్: మయన్మార్లోని కాచిన్ రాష్ట్రంలో ఘోర ప్రమాదంజరిగింది. జాడే అనే ప్రాంతంలో భారీవర్షాలు కురిశాయి. దీంతో కొండచరియలు విరిగిపడటంతో 113 మంది కార్మికులు మృతిచెందారు.వందలాదిమంది గనుల్లో పనిచేస్తున్న సమయంలో అమాంతంగా కొండచరియలు విరిగిపడ్డాయి.ఈ ప్రమాదంలోమృతుల సంఖ్య మరింతగా పెరిగేఅవకాశమున్నదని అధికారవర్గాలుతెలిపాయి. కొండచరియల కింద కార్మికులు చిక్కుకునిఉండొచ్చని సహకార్మికులు అంటున్నారు. సహాయక చర్యలను వేగిరపర్చారు. అయితే కాచిన్లో ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయనీ,2015లో కూడా ఇలాంటి ప్రమాదం జరగటంతో 116 మందికార్మికులు ప్రాణాలు కోల్పోయారని సహాయకబృందాలు తెలిపాయి.