Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖాట్మండ్ : నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలి భవిష్య త్తును నిర్ణయించే కీలకమైన నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (ఎన్సిపి) స్టాండింగ్ కమిటీ సమావేశం సోమవారానికి వాయిదా పడింది. మొదట ఈ సమావేశాన్ని శనివారం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నా పలు కారణాలతో వాయిదా పడినట్లు అధికారిక ప్రకటన వెల్లడించింది. ఎన్సిపికి చెందిన సీనియర్ నేతలు కీలక సమస్యలపై అవగాహన తెచ్చుకునేందుకు మరి కొంత సమయం అవసరం కావడంతో భేటీని సోమవారానికి మార్చినట్లు ప్రధాని మీడియా సలహాదారు సూర్య థాపా పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఓలి చేసిన భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు రాజకీయంగా సరైనది కాదని, దౌత్య పరంగా కూడా తగదని పలువురు ఎన్సిపి నేతలు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో శక్తివంతమైన వింగ్గా ఈ స్టాండింగ్ కమిటీ ఉంది. ఈ కమిటీలో పార్టీకి చెందిన 45 మంది సీనియర్ నాయకులు ఉంటారు.