Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బైరుట్ (లెబినాన్): వెస్ట్ బ్యాంక్ భూభాగాలను ఇజ్రాయల్ దురాక్రమించుకోవడాన్ని లెబనాన్కు చెందిన మిలిటెంట్ గ్రూపు హెజ్బోల్లా, పాలస్తీనాకు చెందిన హమాస్ సోమవారం తీవ్రంగా ఖండించాయి. ఈ భూభాగాలను అక్రమించుకోవడం 'పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా దూకుడు చర్య'గా పేర్కొన్నాయి. దీనిని ఎదుర్కోవడానికి ఐక్యంగా కదలిరావాలని పిలుపునిచ్చాయి.
ఇజ్రాయల్ దురాక్రమణపై హెజ్బోల్లా చీఫ్ హస్సన్ నస్రాల్లాహకు హమాస్ నేత ఇస్మాయిల్ హనైయె ఒక లేఖ పంపారు. దురాక్రమణ కారణంగా పాలస్తీనా సమాధి అయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని హెజ్బోల్లా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ట్రంప్ మిడిల్ ఈస్ట్ ప్రణాళికలో భాగంగా వెస్ట్బ్యాంక్లోని 30 శాతం భూభాగాన్ని దురా క్రమించుకుంటామని ఇజ్రాయల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. ట్రంప్ మిడిల్ ఈస్ట్ ప్రణాళిక ఇజ్రాయల్కు ఎక్కువ అనుకూలంగా ఉంది. దీనిని పాలస్తీనా తిరస్కరిస్తుంది.
కరోనా వైరస్ వ్యాప్తితో దురాక్రమణ చర్య ప్రస్తుతానికి నిలిచిపోయినట్లు కనిపిస్తున్నా, వాషింగ్టన్ నుంచి తుది అనుమతి కోసం ఇజ్రాయల్ ఎదురుచూస్తుంది.
ఇజ్రాయల్ దురాక్రమణ చర్యను అంతర్జాతీయ సమాజంతో పాటు దాన్ని సన్నిహిత దేశాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఇజ్రాయల్ దురాక్రమణను ఎదుర్కోవడానికి పాలస్తీనా ప్రజలు తగిన సామర్థ్యంతో ఉన్నారని హెజ్బోల్లా ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరంతర దురాక్రమణను వ్యతిరేకించడానికి ప్రపంచంలోని స్వేచ్చాయుతమైన ప్రజలు కదలిరావాలని పిలునిచ్చింది.