Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-వాతావరణ మార్పులను అదుపులో పెట్టండి
-ప్రపంచ జూనోసెస్ దినోత్సవం సందర్భంగా ఐరాస పిలుపు
నైరోబి : భవిష్యత్ మహమ్మారులను నివారించడానికి పర్యావరణాన్ని రక్షించాలని, వాతావరణ మార్పులను అదుపులోపెట్టాలని ఐరాస పిలుపునిచ్చింది. జూలై 6 ప్రపంచ జూనోనెస్ (జంతువులు నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధి) దినోత్సవం సందర్భంగా ఐరాస ఈ పిలుపునిచ్చింది. జూనోటిక్ వ్యాధి రేబిస్కు 1885 జులై 6న ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూయి పాశ్చర్ విజయవంతంగా టీకా కనిపెట్టిన నేపధ్యంలో ఈ దినోత్సవం నిర్వహిస్తారు.
భూమి డిగ్రేషన్, వ్యవప్రాణులు అంతరించపోవడం, ఇంటెన్సివ్ వ్యవసాయం, వాతావరణ మార్పులు.. వంటివి కరోనా వైరస్ వంటి జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధులు విజృంభించడానికి కారణమవు తున్నాయని ఐరాస నిపుణులు తెలిపారు.
జూనోటిక్ వ్యాధుల విజృంభణకు 7 ప్రధాన కారణాలు ఉన్నాయని ఐరాస పర్యావరణ పథకం (యుఎన్ఈపి), ఇంటర్నేషనల్ లైవ్స్టోక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఎల్ఆర్ఐ) సంయక్తంగా తెలిపాయి. భవిష్యత్ మహమ్మరిలను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చాయి. జంతు ప్రోటిన్ కోసం డిమాండ్ పెరగడం, సహజ వనరులు వెలికితీత-పట్టణీకరణ, ఇంటెన్సివ్- నిలకడలేని వ్యవసాయం, వన్యప్రాణుల దోపిడి, ప్రయాణం- రవాణ పెరగడం, ఆహర పంపణీలో మార్పులు, వాతావరణ మార్పులు..జూనోటిక్ వ్యాధులు విజృంభణకు ఏడు ప్రధాన కారణాలుగా తెలిపాయి. వ్యవస్థలకు మహమ్మారులు ఎంత ప్రమాదకరమైనవో గత కొన్ని నెలలుగా మనం చూస్తున్నామని యుఎన్ఈపి ఎగ్జిక్యూటివ్ డైరక్టెర్ తెలిపారు. భవిష్యత్లో మహమ్మారులు విజృంభించకుండా సహజ వాతావరణాన్ని రక్షించడానికి మనం ఉద్దేశపూర్వకంగా కట్టుబడి ఉండాలని చెప్పారు.
మనకు తెలిసిన అంటువ్యాధుల్లో 60 శాతం, అభివృధ్ధి చెందుతున్న అంటువ్యాధుల్లో 70 శాతం జూనోటిక్ వ్యాధులేనని తెలిపారు. జూనోటిక్ వ్యాధులను నిర్లక్ష్యం చేయడం ద్వారా ప్రతీ ఏటా 20 లక్షలమంది చనిపోతున్నారని, వీరిలో ఎక్కువ మంది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన వారేనని చెప్పారు. ఇలాంటి వ్యాధులు అనారోగ్యానికి, మరణాన్ని కలిగించడమే కాకుండా పేదలకు ఆర్థిక నష్టాలను కూడా కలిగిస్తున్నాయని చెప్పారు. గత రెండు దశాబ్ధాల్లో ఈ వ్యాధుల వలన 100 బిలియన్ డాలర్ల మేర నష్టం సంభవించిందని చెప్పారు. వచ్చే కొన్ని ఏళ్లలో కోవిడ్-19తో 9 ట్రిలియన్ డాలర్ల నష్టం జరుగుతుందని అంచనా వేసున్నట్లు చెప్పారు.
ఇలాంటి పరిసిత్థుల్లో జూనోటిక్ వ్యాధులను నియంత్రించడానికి జరుగుతున్న ప్రయత్నాలు నామమాత్రంగా ఉన్నాయని ఐరాస నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజారోగ్యం, వ్యవసాయ స్థిరత్వం కోసం... వన్య ప్రాణులు దోపిడీ, వాతావారణ మార్పులు తగ్గించడానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.