Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రానున్న ఎన్నికల్లో ఎంఎఎస్ అభ్యర్థి గెలుపు!
లాపజ్ : బోలివియా ప్రజలు సోషలిజం వైపు అడుగులు వేస్తున్నట్టు స్పష్టంగా వెల్లడవుతుంది. సెప్టెంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మూ మెంట్ టూవర్డ్స్ సోషలిజం (ఎంఎఎస్) అభ్యర్థి లూయిస్ ఆర్సె విజయం సాధించనున్నట్టు ఒక సర్వేలో వెల్లడయింది. వచ్చే ఎన్నికల్లో లూయిస్కు సుమారు 42 శాతం ఓట్లు వస్తాయని లాటిన్ అమెరికా స్ట్రాటెజిక్ సెంటర్ ఫర్ జియోపాలిటిక్స్ (సిఈఎల్ఎజి) చేసిన సర్వే వెల్లడించింది. బోలివియన్ రైట్ వింగ్ అభ్యర్థి కార్లోస్ మెసాకు 26 శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే తెలిపింది. అలాగే ఈ సర్వేలో పాల్గొన్న ప్రతీ నలుగురులో ముగ్గురు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ప్రతికూలంగా భావించారు.