Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : ప్రపంచాన్ని గడగడలాడించిన 2008 ఆర్థికమాంద్యం కంటే.. కరోనా కారణంగా తలెత్తిన సంక్షోభంతో అమెరికన్లు చాలా నష్టపోతారని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. మహమ్మారిని అరికట్టేందుకు విధించిన నిబంధనల కారణంగా వ్యాపారాలు నష్టాలపాలవుతున్నాయనీ, ఉద్యోగులు తమ జీవనోపాధిని కోల్పోతున్నారని తెలిపింది. ఈ మేరకు ఐఎంఎఫ్ లో పని చేస్తున్న ఇప్పీ శిబట.. '2008, 2020 లలో వివిధ పరిశ్రమల్లో ఉద్యోగులపై ప్రభావం' పేరిట ఒక అధ్యాయాన్ని వెలువరించారు. ఇందులో ప్రస్తావించిన విషయాల ప్రకారం.. 2008 లో మాంద్యం తలెత్తినప్పుడు అమెరికన్లు కోల్పోయిన ఉద్యోగాల కంటే తాజా సంక్షోభంతో ఎక్కువమంది నష్టపో తారు. ముఖ్యంగా సేవారంగంలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతారు. వ్యవసాయ, నిర్మాణ, ఫైనాన్స్ సెక్టార్ లకు దీన్నుంచి కొద్దిగా ఉపశమనం ఉండొచ్చు. కానీ మిగిలిన రంగాలన్నీ తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఉపాధి కోల్పోవడం జాతి, వయసు, వేతనాలు, లింగం, ఉద్యోగ స్వభావాన్ని బట్టి ఉంటుంది. మహిళలు, జాతిపరంగా చూస్తే.. నల్లజాతి ప్రజలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. అత్యవసర ఉద్యోగాల కంటే.. 'సామాజిక' రంగంలో సేవలందిస్తున్నవారు ఎక్కువగా ఉపాధి కోల్పోతారు. అయితే ఇంటి దగ్గర్నుంచి పని చేసే వృత్తి నైపుణ్య నిపుణులు తక్కువగా ప్రభావితమవుతారని నివేదికలో పేర్కొన్నారు.