Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కఏడాదిలోనే లక్ష కోట్లు : ఎస్అండ్పీ
వాషింగ్టన్ : కరోనా వైరస్ ప్రభావం వల్ల 2021 ముగింపు నాటికి ప్రపంచ బ్యాంక్లకు మొత్తంగా 2.1 ట్రిలియన్ డాలర్లు (రూ.1.60 లక్షల కోట్లు) నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్న దని అంతర్జాతీయ రేటింగ్ ఎజెన్సీ ఎస్అండ్పీ అంచనా వేసింది. ప్రస్తుత ఒక్క ఏడాదిలోనే రూ.1 లక్ష కోట్ల మేర కోల్పోయే అవకాశం ఉన్నదని ఓ రిపోర్ట్లో పేర్కొంది. ఇందులోనూ 60 శాతం ఆసియా-ఫసిపిక్ బ్యాంక్ల్లోనే నష్టం జరగొచ్చని తెలిపింది. టాప్ 200 రేటెడ్ బ్యాంక్లు మొత్తం గ్లోబల్ బ్యాంక్ల్లో మూడింటిలో రెండో వంతు వాటా కలిగి ఉన్నాయి. ప్రస్తుత ఏడాదిలో ఆర్జించిన దానిలో 75 శాతం నష్టాలకే కేటాయించాల్సి రావొచ్చని ఈ రిపోర్ట్ విశ్లేషించింది. 2021లో ఈ నిష్ఫత్తి 40 శాతంగా చోటు చేసుకోవచ్చని తెలిపింది.